రెండో దశలోనూ పోటెత్తిన ఓటర్లు
చెదురుమదురు ఘటనల మధ్య ఆంధ్రప్రదేశ్లో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.
ఇంటర్నెట్డెస్క్: చెదురుమదురు ఘటనల మధ్య ఆంధ్రప్రదేశ్లో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలుచోట్ల తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మొదటి దశలో మాదిరిగానే రెండో దశలో కూడా ఓటర్లు పోటెత్తారు. తొలిదశ ఎన్నికల్లో భారీగా 81.42% పోలింగు నమోదైన విషయం తెలిసిందే. రెండో దశలో అదే విధంగా పోలింగ్ శాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉదయం 6గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.2,786 సర్పంచి, 20,817 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తాడేపల్లిలోని పంచాయతీరాజ్శాఖ కమిషనర్ కార్యాలయంలో కమాండు కంట్రోల్ సెంటర్ నుంచి సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో పోలింగును కమిషనర్ గిరిజాశంకర్ పరిశీలిస్తున్నారు.
> కృష్ణా జిల్లా నిమ్మకూరులోని పోలింగ్ కేంద్రంలో వివాదం తలెత్తింది. ఓటరుకు సహాయకుడిని పంపే విషయంలో తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాలు బాహాబాహీకి దిగే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు.
> శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో ఉద్రిక్తత ఏర్పడింది. ఓటర్ల జాబితాలో అదనంగా ఓట్లు ఉన్నాయంటూ తెదేపా మద్దతు దారులు ఆందోళనకు దిగారు. ఓటర్ల జాబితాలోకి కొత్త పేర్లు ఎలా వచ్చాయో చెప్పాలని అధికారులను డిమాండ్ చేశారు. పోలింగ్ను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.
ఇనిమెళ్లలో దొంగ ఓట్లు
తెదేపా మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు స్వగ్రామమైన గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఇనిమెళ్లలో దొంగ ఓట్లు కలకలం రేపాయి. ఎస్సీ కాలనీలోని 7వ బూత్ వద్ద వైకాపా వర్గీయులు ఒకరికి బదులు మరొకరు ఓటు వేస్తుండటంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. వైకాపా ఏజెంట్లు తెదేపా ఓటర్ల నుంచి దౌర్జన్యంగా స్లిప్పులు లాక్కొని అడ్డుకుంటున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. ఈ ఘటనతో ఇనిమెళ్ల గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
ఇవీ చదవండి...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్