ప్రభుత్వ లాంఛనాలతో మిల్కాసింగ్ అంత్యక్రియలు
స్ప్రింట్ దిగ్గజం మిల్కా సింగ్ అంత్యక్రియలను పంజాబ్ ప్రభుత్వం శనివారం అధికారిక లాంఛనాలతో జరిపించింది.
చండీగఢ్: స్ప్రింట్ దిగ్గజం మిల్కా సింగ్ అంత్యక్రియలను పంజాబ్ ప్రభుత్వం శనివారం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు, పంజాబ్ గవర్నర్ వీపీ సింగ్ బండోరే, హరియాణా క్రీడా శాఖ మంత్రి సందీప్ సింగ్ తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు. మిల్కాసింగ్ చితికి ఆయన కుమారుడు జీవ్ మిల్కాసంగ్ నిప్పంటించారు. మిల్కా సింగ్ మృతికి సంతాపంగా రాష్ట్రంలో ఒకరోజు సెలవు ప్రకటిస్తున్నట్లు పంజాబ్ ప్రభుత్వం వెల్లడించింది. పటియాలాలోని క్రీడా విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెడుతున్నట్లు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు.
మిల్కాసింగ్ నివాసానికి వెళ్లిన అమరీందర్ సింగ్.. 1960లో పాకిస్థాన్కు చెందిన అబ్దుల్ ఖాలిక్ను లాహోర్లో ఓడించిన సందర్భంగా దేశవ్యాప్త సెలవు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ విజయం తర్వాతే పాకిస్థాన్ అధ్యక్షుడు జనరల్ అయూబ్ ఖాన్ మిల్కా సింగ్ను ‘ఫ్లయింగ్ సిక్’ అనే పేరుతో సంభోదించారు. గత నెల కరోనా బారిన పడ్డ మిల్కాసింగ్.. అనంతరం పలు అనారోగ్య కారణాలతో శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఆయన భార్య నిర్మల్ కౌర్ కూడా ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం