అక్కడ టీ ధర రూ.1000!
ఏదైనా ఓ టీ దుకాణంలో ఛాయ్ ధర ఎంత ఉంటుంది. సాధారణంగా రూ.5, 10 లేదా రూ.15 ఉంటుంది. కానీ బంగాల్లోని నిర్జాస్ టీ దుకాణంలో మాత్రం రూ.1,000 వరకు ధర పలుకుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఏదైనా ఓ టీ దుకాణంలో ఛాయ్ ధర ఎంత ఉంటుంది. సాధారణంగా రూ.5, 10 లేదా రూ.15 ఉంటుంది. కానీ బెంగాల్లోని నిర్జాస్ టీ దుకాణంలో మాత్రం రూ.1,000 వరకు ధర పలుకుతోంది. అక్కడ టీ తాగే వారికి ఆరోగ్య సంరక్షణ కూడా లభిస్తోంది. ఆ తేనీరు విశేషాలేంటో ఓసారి తెలుసుకుందాం.
రోజువారీ ఉద్యోగ జీవితంతో విసుగు చెందిన కోల్కతాకు చెందిన పార్థ గంగూలీ ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నారు. తరచూ స్నేహితులతో ఆ అంశంపై చర్చిస్తూ వచ్చారు. మిత్రుల సలహా మేరకు వేర్వేరు రకాల తేనీరు అందించాలని నిర్ణయించారు. 2014లో ముకుంద్పూర్లోని రెండు ప్రైవేటు ఆసుపత్రులకు సమీపంలో నిర్జాస్ అనే టీ దుకాణం ప్రారంభించారు. నిర్జాస్ టీ దుకాణంలో తేనీరు ధర రూ.15 నుంచి రూ.1,000 వరకు ఉంది. ఇది టీ తయారు చేసే తేయాకు ఆధారంగా ఉంటుంది. గంగూలీ దుకాణంలో సుమారు 100 రకాల తేనీరు లభిస్తుంది. రుచులు కూడా అదే విధంగా ఉంటాయి. ఇక్కడ ఎన్ని రకాల టీలు ఉన్నా ప్రాచుర్యం కలిగిన తేనీరు మాత్రం మస్కటెల్ టీ. ఈ సుగంధ టీ రుచులను ఆస్వాదించేందుకు కోల్కతా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తారు.
టీ దుకాణం ప్రారంభించడం వెనక అసలు ఉద్దేశం వేరే ఉందంటారు గంగూలీ. ఉపాధి కోసమే కాకుండా తేనీరుతోనే వినియోగదారులకు ఆరోగ్యం అందించాలని సంకల్పించినట్లు వివరించారు. టీ తాగడం వల్ల మానసికంగా ఉత్తేజం కలగడంతో పాటు ఆరోగ్య పరంగా మంచిదని తెలిపారు. త్వరలోనే తేనీరు ఆధారంగా చికిత్స అందించే టీ క్లినిక్ను ప్రారంభించనున్నట్లు గంగూలీ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
C-Vigil: సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM