తెలంగాణలో క్రమంగా విస్తరిస్తోన్న సెకండ్ వేవ్..
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ క్రమక్రమంగా విస్తరిస్తోంది. పలు జిల్లాల్లో లెక్కకుమించి కేసులు నమోదవుతున్నాయి. అప్రమత్తమైన అధికారులు ఎక్కడికక్కడ కట్టడి చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆర్టీపీసీఆర్ పరీక్షలను ఎక్కువ సంఖ్యలో నిర్వహించేందుకు....
పలు జిల్లాల్లో లెక్కకుమించి కేసులు
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలో కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. పలు జిల్లాల్లో లెక్కకుమించి కేసులు నమోదవుతున్నాయి. అప్రమత్తమైన అధికారులు ఎక్కడికక్కడ కట్టడి చర్యలు చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్టీపీసీఆర్ పరీక్షలను ఎక్కువ సంఖ్యలో నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు చర్యలు చేపట్టింది. పరీక్షా కేంద్రాల సంఖ్య పెంచి, నమూనాలను త్వరితగతిన సేకరించనుంది.
హైదరాబాద్లో 4 కొవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. బేగంపేటలోని నేచర్ క్యూర్ ఆసుపత్రి, ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, చార్మినార్లోని నిజామియా టీబీ ఆసుపత్రి, మెహదీపట్నంలోని సరోజినీ కంటి ఆసుపత్రిలో కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇక ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ పూర్తిస్థాయిలో కరోనా సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనాను అరికట్టాలంటే ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రతిఒక్కరు మాస్కు ధరించాలని, బహిరంగ ప్రదేశాల్లో మాస్కు లేకుండా తిరిగేవారిపై జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశించారు. కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, పోలీసుస్టేషన్ అధికారులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆదిలాబాద్ జిల్లాలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. శుక్రవారం ఒక్కరోజే నలుగురు వ్యక్తులు మృతిచెందడం కలకలం సృష్టిస్తోంది. జిల్లాలో యాక్టివ్ కేసుల సంఖ్య 1235కు చేరడం భయాందోళనకు గురిచేస్తోంది. పక్కనే ఉన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లోని గ్రామాల్లో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజు 400లకుపైగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రను ఆనుకొని ఉన్న గ్రామాల్లో మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉంది. కరోనా కట్టడికి స్థానికంగా పలుచోట్ల లాక్డౌన్లు విధించుకుంటున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లతో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఫోన్లో మాట్లాడి దిశానిర్దేశం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంగడి బజార్లో కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ రైతులు, వ్యాపారులు, వినియోగదారులకు ఏసీపీ మహేందర్ మాస్కులు పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లాలోనూ మహమ్మారి విజృంభిస్తోంది. మల్యాలలో రెండు రోజుల్లో 134 కేసులు నమోదు కావడంతో మరిన్ని పరీక్షలు నిర్వహించి, నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రవి ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట