Bathukamma: దుబాయ్‌ ‘బూర్జ్‌ ఖలీఫా’పై బతుకమ్మ ప్రదర్శన

తెలంగాణ ప్రజల పూల పండుగ ‘బతుకమ్మ’కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోనే ఎత్తైన భవనం దుబాయ్‌లోని ‘బూర్జ్‌ ఖలీఫా’ స్క్రీన్ పై బతుకమ్మను ప్రదర్శించనున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో శనివారం (అక్టోబర్‌ 23న) నుంచి రాత్రి 9.40 -10.30గంటల వరకూ ఈ కార్యక్రమం కొనసాగనుంది.

Published : 23 Oct 2021 01:10 IST

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజల పూల పండుగ ‘బతుకమ్మ’కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోనే ఎత్తైన భవనం దుబాయ్‌లోని ‘బూర్జ్‌ ఖలీఫా’ స్క్రీన్‌పై బతుకమ్మను ప్రదర్శించనున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో శనివారం (అక్టోబర్‌ 23న) రాత్రి 9.40 -10.30గంటల వరకూ ఈ కార్యక్రమం కొనసాగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు తెలంగాణ బతుకమ్మ విశిష్టత తెలపడమే దీని ముఖ్య ఉద్దేశం. బూర్జ్‌ ఖలీఫా మీద బతుకమ్మను ప్రదర్శించబోయే స్క్రీన్.. ప్రపంచంలోనే అతి పెద్దది కావడం విశేషం. తెలంగాణ జాగృతి సభ్యులతో పాటు తెలంగాణలోని పలువురు ప్రజా ప్రతినిధులు, ఎన్నారైలు, యూఏఈ ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలు ఇందులో పాల్గొననున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని