TSRTC: తెల్లవారుజాము 4 గంటల నుంచే బస్సులు
కరోనా భయాలు తొలగి ప్రజారవాణాకు డిమాండ్ పెరుగుతుండడంతో వేకువజాము నుంచే బస్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది ఆర్టీసీ. ముందుగా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లతోపాటు
ఈనాడు, హైదరాబాద్: కరోనా భయాలు తొలగి ప్రజారవాణాకు డిమాండ్ పెరుగుతుండడంతో వేకువజాము నుంచే బస్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది ఆర్టీసీ. ముందుగా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లతోపాటు ఎంజీబీఎస్, జేబీఎస్ల నుంచి కూడా వేకువజామునే బస్సులుండేలా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు బస్సుల్లో ప్రయాణించి రద్దీని అంచనా వేసి అవసరమైన మేరకు బస్సులను పెంచే చర్యలు చేపట్టారు.
హయత్నగర్- కోఠి మధ్య అదనంగా 12 సర్వీసులు..
నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్ల నుంచి ఉదయం 4 గంటలకే అన్ని ప్రాంతాలకు సిటీ బస్సులు బయలుదేరుతున్నాయని గ్రేటర్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు చెప్పారు. హయత్నగర్, ఫలక్నుమా, హెచ్సీయూ, మియాపూర్, బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్, ఉప్పల్, జీడిమెట్ల, చెంగిచర్ల, మిధాని, మెహిదీపట్నం డిపోల నుంచి కూడా వేకువజామునే బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటున్నాయి. గతంలో మాదిరే అన్ని బస్సు సర్వీసులను వేకువ జాము నుంచి అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా.. రాత్రి కూడా 10 గంటల వరకూ వాటికి షెడ్యూల్ వేశామన్నారు. విద్యాసంస్థలు పూర్తి స్థాయిలో పని చేస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు అనువుగా ఉండేందుకు టీఎస్ఆర్టీసీ సిటీ బస్సులను పెంచింది. హయత్నగర్-కోఠి మధ్య రోజూ తిరిగే బస్సులకు అదనంగా మరో 12 సర్వీసుల(రూటు నంబరు 299)ను అందుబాటులోకి తీసుకు వచ్చామని హైదరాబాద్ రీజియన్ మేనేజర్ వెంకన్న చెప్పారు. బుధవారం నుంచి అదనంగా బస్సులను నడుపుతున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.