Amaravati Padayatra: ప్రజల మద్దతుతో 31వ రోజు సాగుతోన్న ‘మహాపాదయాత్ర’ 

ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులు, మహిళలు చేస్తున్న మహాపాదయాత్ర 31వ రోజు కొనసాగుతోంది. ..

Updated : 01 Dec 2021 10:48 IST

నెల్లూరు: ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులు, మహిళలు చేస్తున్న మహాపాదయాత్ర 31వ రోజు కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా మరుపూరు నుంచి ఇవాళ్టి యాత్ర ప్రారంభమైంది. 12 కిలోమీటర్ల మేర సాగే యాత్ర మరిపల్లి వద్ద ముగియనుంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో చేపట్టిన రైతుల పాదయాత్ర సర్వేపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రైతులకు స్వాగతం పలికారు.

మరోవైపు పాదయాత్రలో భాజపా కిసాన్‌ మోర్చా నాయకులు పాల్గొన్నారు. స్థానికుల నుంచి యాత్రకు అపూర్వ స్పందన లభిస్తోందని అమరావతి ఐక్య కార్యాచరణ వేదిక సభ్యులు చెప్పారు. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్ర 45 రోజుల పాటు కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా డిసెంబరు 15కు తిరుపతికి చేరనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని