Amaravati Padayatra: ఆంక్షలు దాటుకుంటూ ‘మహాపాదయాత్ర’ ముందుకు..
అమరావతి రైతులు, మహిళలు చేస్తున్న ‘మహాపాదయాత్ర’ 32వ రోజు కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మర్రిపల్లె నుంచి ప్రారంభమైన
పొదలకూరు: అమరావతి రైతులు, మహిళలు చేస్తున్న ‘మహాపాదయాత్ర’ 32వ రోజు కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మర్రిపల్లె నుంచి ప్రారంభమైన ఇవాళ్టి యాత్ర 14కి.మీ మేర సాగి తురిమెర్ల వద్ద ముగియనుంది. తుమ్మలతలుపూరు వద్ద రైతులు మధ్యాహ్న భోజనం చేయనున్నారు. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరుతో చేపట్టిన యాత్రలో తెదేపా, భాజపా నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు. పోలీసుల ఆంక్షలు దాటుకొని ప్రజల మద్దతుతో యాత్ర ముందుకు సాగుతోందని రైతులు చెబుతున్నారు.
రాజకీయ పార్టీల మద్దతుతో పాటు స్థానికుల నుంచి యాత్రకు అపూర్వ స్పందన లభిస్తోందని అమరావతి ఐకాస నేతలు తెలిపారు. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్ర 45 రోజుల పాటు కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా డిసెంబరు 15కు తిరుపతికి చేరనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!