Amaravati Padayatra: రైతుల పాదయాత్ర రాష్ట్రం కోసం..స్వప్రయోజనాలకు కాదు: లక్ష్మీనారాయణ
అమరావతి రైతులు వారి ప్రయోజనాల కోసం ‘మహాపాదయాత్ర’ చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారని.. ఇందులో ఎటువంటి సత్యం లేదని సీబీఐ
నెల్లూరు: అమరావతి రైతులు వారి ప్రయోజనాల కోసం ‘మహాపాదయాత్ర’ చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారని.. ఇందులో ఎటువంటి సత్యం లేదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్ర భవిషత్తు, రాష్ట్ర ప్రయోజనాల కోసం రైతులు పోరాటం చేస్తున్నారని ఆయన వివరించారు. అమరావతినే ఏపీ ఏకైక రాజధానిగా కొనసాగించాలని రాజధాని రైతుల చేస్తున్న పాదయాత్ర 35వ రోజు నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. పుట్టంరాజుకండ్రిగలో రైతులు ఇవాళ్టి యాత్ర ప్రారంభించారు.
యాత్రకు సంఘీభావం తెలిపిన లక్ష్మీనారాయణ వారితో పాటు పాదయాత్రలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగ శాతం పెరిగిపోతోందని.. రాజధాని ఒకచోట ఉంటే పెట్టుబడులు వస్తాయన్నారు. పెట్టుబడులను ఆకర్షించినప్పుడే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆయన చెప్పారు. ప్రభుత్వాలు మారొచ్చు కానీ పాలసీలు మారకూడదని తెలిపారు. మరోవైపు ఇవాళ్టి యాత్ర వెంకటరెడ్డిపల్లి, అంబల పూడి, బాలాయపల్లి మీదుగా 15కిలోమీటర్ల మేర సాగి వెంగమాంబపురంలో ముగియనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 30 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సింగ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?