AP HighCourt: ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణపై సుమోటోగా హైకోర్టు విచారణ
రాష్ట్రంలో ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల ఉపసంహరణ అంశంలో హైకోర్టు సుమోటోగా విచారణ జరిపింది. వైకాపా ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, విడదల రజని, జక్కంపూడి రాజా..
అమరావతి: రాష్ట్రంలో ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల ఉపసంహరణ అంశంలో హైకోర్టు సుమోటోగా విచారణ జరిపింది. వైకాపా ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, విడదల రజని, జక్కంపూడి రాజా, మేకా వెంకటప్రతాప్ అప్పారావు, మల్లాది విష్ణు, ఎంపీ మిథున్రెడ్డి, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై నమోదైన క్రిమినల్ కేసులను ఉపసంహరించినట్లు రాష్ట్ర హోంశాఖ గతంలో జీవోలు జారీ చేసింది. దీనిపై సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణపై హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది.
కేసుల ఉపసంహరణకు సంబంధించిన జీవోలు విడుదల చేసిన రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి తమకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ప్రజాప్రతినిధులకు సంబంధించి ఎన్ని కేసులు ఉపసంహరణకి ప్రతిపాదనలు వచ్చాయో నివేదిక ఇవ్వాలని ఆ కేసుల విచారణ జరుపుతున్న విజయవాడ ప్రత్యేక కోర్టును హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 24కి వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!