Posani: పోసాని ఇంటిపై రాళ్లదాడి.. పోలీసులకు ఫిర్యాదు

సినీనటుడు పోసాని కృష్ణమురళి ఇంటిపై అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఎస్‌ఆర్‌ నగర్‌ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో

Updated : 30 Sep 2021 14:32 IST

హైదరాబాద్‌: సినీనటుడు పోసాని కృష్ణమురళి ఇంటిపై బుధవారం అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. నగరంలోని ఎల్లారెడ్డిగూడలో ఉన్న పోసాని ఇంటిపై ద్విచక్ర వాహనంలో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వినట్లు పోలీసులకు సూపర్‌వైజర్‌ పురుషోత్తం ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో పోసాని ఇంటిలో పనిచేస్తున్న ఇద్దరికి ప్రమాదం తప్పిందని.. అసభ్య పదజాలంతో దూషిస్తూ రాళ్లు విసిరినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

సూపర్‌వైజర్‌ ఫిర్యాదు మేరకు ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో భాగంగా పోసాని ఇంటి సమీపంలోని సీసీ టీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇటీవల జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై పోసాని కృష్ణమురళి తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో దుండగులు రాళ్ల దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని