Off beat: వివాహ విందులో ఆహారం మిగిలిందని.. ఆ మహిళ ఏం చేసిందో తెలుసా..?
భారత్లో పెళ్లిళ్లు అంటే భారీదనానికి పెట్టింది పేరు. పెళ్లి తంతు మొదలైన దగ్గరి నుంచి ప్రతి చిన్న కార్యక్రమంలోనూ తమ తాహతు కనిపించేలా ఏర్పాట్లు ఉంటాయి. ఇక ఆతిథ్యం విషయంలో ఏమాత్రం తగ్గేదేలే.
కోల్కతా: భారత్లో పెళ్లిళ్లు అంటే భారీతనానికి పెట్టింది పేరు. పెళ్లి తంతు మొదలైన దగ్గరి నుంచి ప్రతి చిన్న కార్యక్రమంలోనూ తమ తాహతు కనిపించేలా ఏర్పాట్లు ఉంటాయి. ఇక ఆతిథ్యం విషయంలో ఏమాత్రం తగ్గేదేలే. వేడుకకు వచ్చిన ఆత్మీయులు రుచికరమైన భోజనం చేయాలని రకరకాల వంటలు సిద్ధం చేస్తారు. ఈ క్రమంలోనే ఆహారపదార్థాలు మిగిలిపోతుంటాయి. అవన్నీ వృథా అవుతున్నా.. పెళ్లి హడావుడిలో పడి వాటిని పట్టించుకునే అవకాశం ఉండకపోవచ్చు..!
అయితే నీలాంజన్ మండల్ అనే వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ షేర్ చేసిన దృశ్యాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. పశ్చిమ్ బెంగాల్లోని రాణాఘట్ రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో తన కెమెరా కంటికి చిక్కిన దృశ్యాలు ఫేస్బుక్లో షేర్ చేశారు. పాపియా కర్ అనే మహిళ తన సోదరుడి వివాహ విందులో మిగిలిన వంటల్ని తీసుకొచ్చి, రైల్వే స్టేషన్ వద్ద అభాగ్యులకు పంచుతూ కనిపించారు. తను ముస్తాబైన దుస్తుల్లోనే అక్కడికి వచ్చి, రైల్వే స్టేషన్ ప్లాట్ఫాంపై కూర్చొని ఆకలితో అలమటిస్తున్నవారికి స్వయంగా వడ్డించారు. ఆమె పెట్టే అన్నం కోసం పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు చాలామంది ఆమె చుట్టూ గుమిగూడారు. ఇలా అన్నార్తులకు కడుపు నిండా తిండి పెట్టడం ఆమెకు కొత్తేం కాదని స్థానికులు వెల్లడించారు. కాగా, ఆమె చూపిన చొరవపై నెట్టింట్లో ప్రశంసలు దక్కుతున్నాయి. ఇలాంటి చర్యలు ఇతరులకు ప్రేరణగా నిలుస్తాయని పలువురు అభినందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం