Long Covid Syndrome: లాంగ్ కొవిడ్ సిండ్రోమ్కు కారణమదేనా..?
కొవిడ్ బాధితుల్లో రక్తం గడ్డకట్టడం దీర్ఘకాల లక్షణాలకు (Long Covid Symdrome) దారితీస్తున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది.
తాజా అధ్యయనం ఏం చెబుతుందంటే..
డబ్లిన్: కరోనా వైరస్ బారినపడి కోలుకున్న తర్వాత కొందరిని దీర్ఘ కాలంపాటు లక్షణాలు వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. వీటిని లాంగ్ కొవిడ్ లక్షణాలుగా పరిగణిస్తోన్న నిపుణులు.. ఇందుకు గల కారణాలను విశ్లేషించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొవిడ్ బాధితుల్లో రక్తం గడ్డకట్టడం దీర్ఘకాల లక్షణాలకు (Long Covid Symdrome) దారితీస్తున్నట్లు అనుమానిస్తున్నారు. లాండ్ కొవిడ్పై ఐర్లాండ్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో పలు కారణాలను విశ్లేషించారు.
లాంగ్ కొవిడ్పై రాయల్ కాలేజ్ సర్జన్స్ ఇన్ ఐర్లాండ్ (RCSI) యూనివర్సిటీకి చెందిన నిపుణులు అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా లాంగ్ కొవిడ్ సిండ్రోమ్తో బాధపడుతున్న 50మంది బాధితుల ఆరోగ్యాన్ని విశ్లేషించారు. ఆరోగ్యంగా ఉన్న వారితో పోలిస్తే లాంగ్ కొవిడ్తో బాధపడుతున్న వారి రక్తంలో గడ్డకట్టే కణాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కొవిడ్ బారినపడిన తర్వాత రక్తం గడ్డకట్టే లక్షణంతో ఆస్పత్రిలో చేరిన వారిలోనే ఈ లక్షణాలు ఎక్కువగా కనిపించాయని చెప్పారు. అంతేకాకుండా రక్తం గడ్డకట్టే మార్కర్లు ఎక్కువగా ఉండి ఇంటిలోనే కోలుకున్న వారిలోనూ లాంగ్ కొవిడ్ లక్షణాలు ఎక్కువగానే ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు.
రక్తం గడ్డకట్టే వ్యవస్థ ప్రమేయంతోనే..
సాధారణంగా కొవిడ్ ఇన్ఫెక్షన్ తగ్గినప్పటికీ శ్వాస సరిగా తీసుకోలేకపోవడం, అలసట, వ్యాయామం చేసే ఓపిక తగ్గడం వంటి లక్షణాలు కొన్ని వారాల నుంచి నెలల తరబడి వేధిస్తుంటే ఇలాంటి వాటిని లాంగ్ కొవిడ్ సిండ్రోమ్గా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా రక్తం గడ్డకట్టే లక్షణాలు ఉన్నవారిలో లాంగ్ కొవిడ్ సిండ్రోమ్తో పాటు శారీరక సామర్థ్యం తగ్గడం, అలసట వంటి లక్షణాలు కనిపించాయని తాజా అధ్యయనంలో పరిశోధకులు తేచ్చారు. అయితే, రక్తంలో వాపునకు కారణమైన మార్కర్లు సాధారణ స్థాయికి పడిపోయినప్పటికీ లాంగ్ కొవిడ్ బాధితుల్లో రక్తం గడ్డకట్టే ముప్పు ఎక్కువగానే ఉందని చెప్పారు. అందుచేత లాంగ్ కొవిడ్ సిండ్రోమ్లో రక్తం గడ్డకట్టే వ్యవస్థ ప్రమేయం ఉందని భావిస్తున్నట్లు RCSIకి చెందిన డాక్టర్ హెలెన్ ఫోగర్టీ పేర్కొన్నారు. ఏదైనా వ్యాధికి కచ్చితమైన చికిత్స అందించాలంటే ఆ వ్యాధికి మూలకారణాన్ని తెలుసుకోవడమే అతిముఖ్యమని ఆర్సీఎస్ఐ యూనివర్సిటీ ప్రొఫెసర్ జేమ్స్ ఓడాన్నెల్ పేర్కొన్నారు. అందుకే వీటిపై అధ్యయనాలు కొనసాగించడం వల్ల ఉత్తమమైన సేవలు అందించవచ్చని సూచించారు.
ఇదిలాఉంటే, ‘పోస్ట్ కొవిడ్ సిండ్రోమ్ (Post Covid Syndrome) లేదా లాంగ్ కొవిడ్’ అనేది వాస్తవమని.. దీనిని ఇప్పటికే నిర్ధారించుకున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈమధ్యే వెల్లడించింది. కానీ, ఇవి ఎంతకాలం ఉంటాయనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేమని, వీటిపై అధ్యయనం చేసి పూర్తిగా నిర్వచించే పనిలో నిమగ్నమయ్యామని కొవిడ్-19పై WHO టెక్నికల్ విభాగాధిపతి మరియా వాన్ కేర్ఖోవ్ పేర్కొన్నారు. ఇన్ఫెక్షన్నుంచి కోలుకున్న తర్వాత ఈ సమస్యలతో బాధపడడం ఆందోళన కలిగించే విషయమని ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్ మహమ్మారికి సంబంధించిన మిస్టరీ అంశాల్లో ‘లాంగ్ కొవిడ్’ ఒకటిగా మిగిలిపోయిందని అభిప్రాయపడ్డారు. అందుకే, వైరస్ బారినపడి కోలుకున్న తర్వాత కూడా దుష్ప్రభావాలు ఉంటే వైద్యుల సహాయం తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ నిపుణులు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM