CBI -ED: ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి నాన్బెయిలబుల్ వారెంట్
ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సీబీఐ కోర్టు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ జరిపిన సీబీఐ, ఈడీ కోర్టు ఈమేరకు శ్రీలక్ష్మికి నాన్ బెయిలబుల్
హైదరాబాద్: ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సీబీఐ కోర్టు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ జరిపిన సీబీఐ, ఈడీ కోర్టు ఈమేరకు శ్రీలక్ష్మికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దాల్మియా కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి నిందితురాలిగా ఉన్నారు. అయితే, ఈరోజు విచారణకు శ్రీలక్ష్మి, ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు గైర్హాజరయ్యారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఆమెకు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వారెంట్ను ఈనెల 30లోగా అమలు చేయాలని ఆదేశించింది.
జగన్, విజయసాయిరెడ్డి డిశ్చార్జి పిటిషన్లపై కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఐ, ఈడీ గడువు కోరాయి. పెన్నా కేసులో విశ్రాంత ఐఏఎస్ జి.వెంకట్రామిరెడ్డి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. దీంతో వెంకట్రామిరెడ్డిపై ఉన్న ఎన్బీడబ్ల్యూను న్యాయస్థానం రీకాల్ చేసింది. వాన్పిక్ కేసులో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డి ఈరోజు విచారణకు హాజరు కాలేదు. వీరిద్దరికీ గతంలో హైకోర్టు మినహాయింపు ఇచ్చినప్పటికీ వారు కానీ, వారి తరఫు న్యాయవాదులు కచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుందని ఆదేశాల్లో పేర్కొంది. మోపిదేవి, బ్రహ్మానందరెడ్డి లాయర్లు గైర్హాజరైతే తగిన ఉత్తర్వులిస్తామని కోర్టు స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
రెండు రోజులపాటు తెలంగాణలో వర్షాలు
రెండ్రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. -
అనంతపురం రేంజ్ డీఐజీగా షిముషి బాజ్పేయ్ని నియమించిన ఈసీ
అనంతపురం రేంజ్ డీఐజీగా షిముషి బాజ్పేయ్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కొట్టేసిన క్యాట్
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను క్యాట్ కొట్టి వేసింది. -
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన జగన్
విదేశాలకు వెళ్లేందుకు ఏపీ సీఎం జగన్ సీబీఐ కోర్టు అనుమతి కోరారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ.. కోడె మొక్కులు చెల్లింపు
ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడ చేరుకుని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
‘మేం ఓట్లు అమ్ముకోం.. మా ఇంటికి రావొద్దు’
మరో వారంలో ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల వేటలో నిగమ్నమయ్యాయి. -
విజయవాడలో ప్రధాని రోడ్షో నేడు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి మోదీ.. బుధవారం విజయవాడ నగరంలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించనున్న రోడ్షోలో పాల్గొననున్నారు. ప్రధానితోపాటు తెదేపా, జనసేన అగ్రనేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్లు కూడా హాజరవుతారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రైల్వే లైన్లు.. రోజుకు సరాసరి 7.41 కి.మీ.ల నిర్మాణం
-
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
-
బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఊరట.. యాప్పై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్బీఐ
-
‘నన్ను క్షమించండి’.. క్షత్రియ వర్గాన్ని మరోసారి వేడుకున్న కేంద్ర మంత్రి