Ts News: జగిత్యాల, రామగుండంలో భూప్రకంపనలు

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రం స్వల్పంగా భూమి కంపించింది. రాష్ట్రంలోని జగిత్యాల, రామగుండం ప్రాంతాల్లో సాయంత్రం 6:49 గంటలకు దాదాపు

Published : 01 Nov 2021 01:05 IST

హైదరాబాద్‌: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రం స్వల్పంగా భూమి కంపించింది. రాష్ట్రంలోని జగిత్యాల, రామగుండం, మంచిర్యాల జిల్లా లక్షేటిపేట, గోదావరి పరివాహక గ్రామాల్లో సాయంత్రం 6:49 గంటలకు దాదాపు 3 సెకన్ల పాటు స్వల్పంగా భూమి కంపించింది. కుమురం భీం జిల్లాలోని చింతలమానేపల్లి, కౌటాల, పెంచికల్‌పేట, బెజ్జూరు మండలాల్లో భూప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయాందోళనలతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని