HYD: హైటెక్స్‌లో ‘ఈనాడు’ ప్రాపర్టీ షో ప్రారంభం

నగరంలోని హైటెక్స్‌ ప్రాంగణంలో ‘ఈనాడు’ ప్రాపర్టీ షో మొదలైంది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ ప్రదర్శనను ప్రారంభించారు.

Updated : 30 Oct 2021 14:07 IST

హైదరాబాద్‌: నగరంలోని హైటెక్స్‌ ప్రాంగణంలో ‘ఈనాడు’ ప్రాపర్టీ షో మొదలైంది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ ప్రదర్శనను ప్రారంభించారు. షోలో భాగంగా రెండు రోజుల పాటు(ఇవాళ, రేపు) ప్రాపర్టీల ప్రదర్శన కొనసాగనుంది. నగరంలో ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు చేపట్టిన ప్రాజెక్టులన్నింటినీ ‘ఈనాడు’ ప్రాపర్టీ షో ఒకే వేదికపైకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా విల్లాలు మొదలు గేటెడ్‌ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్లు, లేఅవుట్‌ వెంచర్ల వరకు ఆయా ప్రాజెక్టులను రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు తమ స్టాళ్లలో ప్రదర్శించనున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని