TS News: బాపుఘాట్‌లో గాంధీ జయంతి వేడుకలు

గాంధీ జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. లంగర్‌హౌస్‌లోని బాపుఘాట్‌లో

Updated : 02 Oct 2021 13:28 IST

హైదరాబాద్‌ : గాంధీ జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. లంగర్‌హౌస్‌లోని బాపుఘాట్‌లో గవర్నర్‌ తమిళిసై మహాత్ముడికి నివాళులు అర్పించారు. సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మంత్రులు మహమూద్‌ అలీ, కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, సత్యవతి రాఠోడ్‌ తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతిపిత సేవలను నేతలు కొనియాడారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని