PV Sindhu: 2024 ఒలింపిక్స్లో బంగారు పతకం సాధిస్తా: పీవీ సింధు
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, వైజాగ్ స్టీల్ బ్రాండ్ అంబాసిడర్ పి.వి.సింధు విశాఖ ఉక్కు కర్మాగారంలో నిర్వహించిన పలు కార్యక్రమంలో పాల్గొన్నారు
విశాఖ: భారత స్టార్ షట్లర్, వైజాగ్ స్టీల్ బ్రాండ్ అంబాసిడర్ పీవీ సింధు విశాఖ ఉక్కు కర్మాగారంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇండోర్ స్టేడియంలోని చిన్నారుల బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను ప్రారంభించారు. అక్కడి నుంచి విమల విద్యాలయానికి వెళ్లి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. క్రీడల్లో ఉత్తమ ప్రదర్శనను కనబరిచిన విద్యార్థులకు ఆమె పతకాలు అందజేశారు. అనంతరం జరిగిన సన్మాన కార్యక్రమంలో సింధు మాట్లాడారు. తనపై ప్రజలు చూపిస్తున్న అదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో 2024 ఒలింపిక్స్లో బంగారు పతకాన్ని సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
‘‘విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ నెలకొల్పాలనే దానిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. తప్పకుండా అకాడమీ నెలకొల్పడానికే ప్రయత్నిస్తాను. ఎంతో మంది క్రీడాకారులను తీర్చదిద్దేందుకు నావంతు కృషి చేస్తాను. గతంలోనూ పాఠశాల సందర్శనకు వచ్చినప్పుడు చాలా మంది క్రీడాకారులు వివిధ ఆటల్లో రాణించడం చూశాను. ఇలాగే వారందరు కష్టపడుతూ.. రానున్న రోజుల్లో దేశానికి పతకాలు సాధిస్తారని ఆశిస్తున్నాను. మీ ప్రేమ, ఆప్యాయతలు నాపై ఎల్లప్పుడూ ఉండాలి. మీ ఆదరాభిమానాలతో భవిష్యత్తులోనూ రాణిస్తాను’ అని సింధు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్