Harish rao: ఇళ్లు పూర్తిగా ధ్వంసమైన వారికి ఆర్థిక సాయం: హరీశ్‌రావు

గులాబ్‌ తుపాను దృష్ట్యా మంత్రి హరీశ్‌రావు అధికారులను అప్రమత్తం చేశారు. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు క్షేత్రస్థాయి పరిస్థితులను గమనించాలని ఆదేశించారు....

Updated : 24 Sep 2022 17:12 IST

సిద్దిపేట: గులాబ్‌ తుపాను దృష్ట్యా మంత్రి హరీశ్‌రావు అధికారులను అప్రమత్తం చేశారు. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు క్షేత్రస్థాయి పరిస్థితులను గమనించాలని ఆదేశించారు. జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులు ఆయా కేంద్రాల్లోనే ఉండాలన్నారు. చెరువులు, జలాశయాల నీటి మట్టాలు పర్యవేక్షిస్తూ ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. కంట్రోల్‌ రూమ్‌కు వచ్చే సమస్యలపై తక్షణమే స్పందించాలన్నారు. తుపాను కారణంగా ఇళ్లు పూర్తిగా ధ్వంసమైన వారికి ఆర్థిక సాయం అందేలా చూడాలని అధికారులను హరీశ్‌ ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని