Telugu News: యాదాద్రి ఆలయ గోపుర తాపడానికి మంత్రి మల్లారెడ్డి విరాళం

ముఖ్యమంత్రి KCR పిలుపుమేరకు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ విమాన గోపురం బంగారు తాపడం కోసం మంత్రి మల్లారెడ్డి 3 కిలోల బంగారానికి సమానమైన

Updated : 28 Oct 2021 17:26 IST

యాదాద్రి: ముఖ్యమంత్రి KCR పిలుపుమేరకు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ విమాన గోపురం బంగారు తాపడం కోసం మంత్రి మల్లారెడ్డి 3 కిలోల బంగారానికి సమానమైన నగదును దేవస్థానానికి అందించారు. మేడ్చల్ నియోజకవర్గం తరఫున మూడు కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్టు మంత్రి చెప్పారు. తన కుటుంబం తరఫున కిలో బంగారం, నియోజకవర్గం తెరాస పార్టీ తరఫున రెండు కిలోల బంగారాన్ని స్వామివారికి విరాళంగా సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఘట్‌కేసర్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులతో కలిసి యాదాద్రి ఆలయానికి ప్రదర్శనగా వెళ్లి ఆలయ అధికారులకు అందజేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని