Tirumala: తిరుమల శ్రీవారికి భారీగా బంగారం విరాళం

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి తమిళనాడుకు చెందిన సంస్థ భారీగా బంగారాన్ని విరాళంగా అందించింది. కోయంబత్తూరుకు చెందిన ఎంఅండ్‌సీ

Updated : 27 Oct 2021 17:08 IST

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి (Venkateswara Swamy) వారికి తమిళనాడుకు చెందిన ఓ సంస్థ భారీగా బంగారాన్ని విరాళంగా అందించింది. కోయంబత్తూరుకు చెందిన ఎం అండ్‌ సీ ప్రాపర్టీస్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (M & C Properties and Development Company Pvt. Ltd) సంస్థ రూ.1.83 కోట్లు  విలువైన 3.60 కిలోల బంగారు బిస్కెట్లను స్వామి వారికి కానుకగా సమర్పించింది. ఆలయంలోని రంగనాయకుల మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అదనపు ఈవో ధర్మారెడ్డికి సంస్థ ప్రతినిధులు బంగారు బిస్కెట్లను అందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని