Sundar Pichai: సరదాగా మాట్లాడుకున్న పిచాయ్, డిస్నీ ఫ్రాగ్..!
ప్రపంచం దృష్టి సారించాల్సిన సుస్థిరాభివృద్ధి, వాతావరణ మార్పు అంశాలపై గూగుల్ సీఈఓ సందర్ పిచాయ్ యూట్యూబ్ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ క్రమంలో డిస్నీకి చెందిన కెర్మిట్ ది ఫ్రాగ్, ఆయనకు మధ్య జరిగిన సరదా సంభాషణ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో వారిద్దరు సరదాగా స్పందించి, సందేశమిచ్చారు. డియర్ ఎర్త్ పేరిట యూట్యూబ్ ఈ కార్యక్రమం నిర్వహించింది.
ప్రపంచం దృష్టిసారించాల్సిన సమస్యలపైనే వారి చర్చ
వాషింగ్టన్: ప్రపంచం దృష్టి సారించాల్సిన సుస్థిరాభివృద్ధి, వాతావరణ మార్పులపై గూగుల్ సీఈవో సందర్ పిచాయ్ యూట్యూబ్ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ క్రమంలో డిస్నీకి చెందిన కెర్మిట్ ది ఫ్రాగ్, ఆయనకు మధ్య జరిగిన సరదా సంభాషణ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో వారిద్దరు సరదాగా స్పందించి, సందేశమిచ్చారు. డియర్ ఎర్త్ పేరిట యూట్యూబ్ ఈ కార్యక్రమం నిర్వహించింది.
ఫ్రాగ్: హాయ్ సుందర్. (ఆ తర్వాత సుందర్ మాట్లాడుతున్నప్పటికీ.. ఆయన మాటలేవీ వినిపించలేదు.)
ఫ్రాగ్: సుందర్, మీ డివైజ్ మ్యూట్లో ఉన్నట్లుంది. అది నేను అస్సలు నమ్మలేకపోతున్నాను.
పిచాయ్: సారీ కెర్మిట్. నా డివైజ్ మ్యూట్లో ఉండిపోయింది. నేను నీకు పెద్ద ఫ్యాన్. నీతో మాట్లాడటం చాలా బాగుంది.
ఇలా సరదాగా మాట్లాడుతూ.. సుస్థిరాభివృద్ధి, వాతావరణ సమస్యలు వంటి సీరియస్ అంశాలపై చర్చించారు. చివరగా తాను గూగుల్లో వెతికి ఎన్నో విషయాలు తెలుసుకున్నానని, ఈ భూమి మీద 8,384 ఉభయచరాలు ఉన్నాయని ఫ్రాగ్ చెప్పింది. అలాగే వాటి పేర్లను చెప్పడం మొదలు పెట్టింది. వెంటనే పిచాయ్ కలుగజేసుకొని.. ఆ జాబితాలో ఉన్న పేర్లను తర్వాత పూర్తి చేద్దామా..? అంటూ దాని నోరు సరదాగా మూయించారు. ఆయన ట్విటర్ వేదికగా వారి సంభాషణ వీడియోను షేర్ చేశారు. ‘మన డివైజ్ అన్మ్యూట్ చేయాలని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. మా డియర్ ఎర్త్లో భాగమైనందుకు కెర్మిట్ ది ఫ్రాగ్కు కృతజ్ఞతలు’ అని రాసుకొచ్చారు. ఈ డియర్ ఎర్త్ కార్యక్రమంలో వేగంగా సంభవిస్తోన్న వాతావరణ మార్పులకు అడ్డుకట్టవేయడమే లక్ష్యంగా చర్చ జరిగింది. దీనిలో పర్యావరణ పరిరక్షకులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
రాష్ట్రంలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు