PV Sindhu: శంషాబాద్ విమానాశ్రయంలో పీవీ సింధుకు ఘన స్వాగతం
ఒలింపిక్ పతక విజేత, స్టార్ షట్లర్ పీవీ సింధు హైదరాబాద్ చేరుకున్నారు. దిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి..
హైదరాబాద్: ఒలింపిక్ పతక విజేత, స్టార్ షట్లర్ పీవీ సింధు హైదరాబాద్ చేరుకున్నారు. దిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న సింధుకి రాష్ట్ర క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సాట్స్ ఛైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, సీపీ సజ్జనార్, అభిమానులు ఘన స్వాగతం పలికారు. టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచాక సింధు తొలిసారి హైదరాబాద్ వచ్చారు.
విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. వచ్చే ఒలింపిక్స్లో సింధు స్వర్ణం సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో క్రీడలను ఎంతో ప్రోత్సహిస్తున్నామని.. త్వరలోనే రాష్ట్రంలో మంచి క్రీడా విధానం తీసుకొస్తామన్నారు. సింధు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహం అందిస్తోందన్నారు. అందరి ప్రోత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తానని సింధు ధీమా వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!