HYD: ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వర్షం.. కొనసాగుతున్న శోభాయాత్ర
నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. చార్మినార్, శాలిబండ, ఫలక్ నుమా, లాల్ దర్వాజ, చాంద్రాయణగుట్ట, యాఖత్ పురా, బహదూర్ పురా, అఫ్జల్గంజ్, మొజంజాహీ మార్కెట్ పాటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు జల్లులు కురిశాయి. చిరుజల్లుల మధ్య గణేశ్ శోభయాత్ర కొనసాగుతోంది. ఇవాళ భాగ్యనగరంలో పెద్ద ఎత్తున గణేశుడి నిమజ్జనం జరుగుతున్న నేపథ్యంలో వర్షంలోనే గణనాథులు ఊరేగింపు సాగుతోంది. మరోవైపు కాసేపట్లో మహాగణపతి ట్యాంక్బండ్కు చేరుకుంటోందని మంత్రి తలసాని తెలిపారు. నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఆయన హుస్సేన్సాగర్లో బోటులో తిరిగారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!