Ts News: యాదాద్రి నారసింహునికి ‘మేఘా’ భారీ విరాళం
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ముందుకొచ్చింది
హైదరాబాద్: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ముందుకొచ్చింది. శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ విమాన గోపురం బంగారం తాపడానికి 6 కిలోలు బంగారాన్ని బహూకరించనున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఆలయ గోపురానికి బంగారు తాపడం చేయించడం ఎంతో పుణ్య కార్యమని.. అందులో తాము పాలుపంచుకోవడం ఎంతో గౌరవప్రదంగా భావిస్తామని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే 6 కిలోల బంగారం లేదా అందుకు సమానమైన మొత్తాన్ని చెక్కు రూపంలో సంబంధిత అధికారులకు అందజేస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆలోచనలతో యాదాద్రి పుణ్యక్షేత్రం మరింత అందంగా రూపుదిద్దుకొని, దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా డోకిపర్రు గ్రామంలో భూసమేత వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎంఈఐఎల్ నిర్మించిందని తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ్లోని దర్శనీయ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఖ్యాతి గడించిందని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు నేడే.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు