Ts News: ఆదివారం వచ్చిందంటే హైదరాబాద్లో పండగే
నగరంలోని ట్యాంక్బండ్, చార్మినార్ ప్రాంతాలు సందడిగా మారాయి. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సండే ఫండే కార్యక్రమానికి నగరవాసుల నుంచి
హైదరాబాద్: నగరంలోని ట్యాంక్బండ్, చార్మినార్ ప్రాంతాలు సందడిగా మారాయి. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సండే ఫండే కార్యక్రమానికి నగరవాసుల నుంచి మంచి స్పందన వస్తోంది. కుటుంబ సమేతంగా నగరవాసులు ట్యాంక్బండ్, చార్మినార్ను సందర్శించి ఉల్లాసంగా గడుపుతున్నారు. హైదరాబాద్ వాసులే కాకుండా ఇతర నగరాలకు చెందిన ప్రజలు సైతం చార్మినార్, ట్యాంక్బండ్ వద్ద ఆనందంగా గడుపుతున్నారు. పిల్లలు, పెద్దల కోసం ఏర్పాటు చేసిన స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ పట్ల సందర్శకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఆదివారం పిల్లలతో గడిపే విధంగా ఉల్లాసభరితమైన కార్యక్రమాలను ఏర్పాట్లు చేస్తున్నారని.. భద్రతాపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వారు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!