TS News: కరోనా పాజిటివిటీ రేటు 0.4శాతానికి తగ్గింది: డీహెచ్ శ్రీనివాసరావు
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్యారోగ్యశాఖ హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ప్రత్యక్ష బోధన ప్రారంభమయ్యాక మూడు వేల పాఠశాలల్లో చేసిన కొవిడ్ పరీక్షల్లో 195 మంది విద్యార్థుల్లో కొవిడ్ గుర్తించినట్లు వైద్యారోగ్యశాఖ ...
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్యారోగ్యశాఖ హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ప్రత్యక్ష బోధన ప్రారంభమయ్యాక మూడు వేల పాఠశాలల్లో చేసిన కొవిడ్ పరీక్షల్లో 195 మంది విద్యార్థుల్లో కొవిడ్ గుర్తించినట్లు వైద్యారోగ్యశాఖ హైకోర్టుకు తెలిపింది. రాష్ట్రంలో 42 లక్షలమంది ఒక్క డోసు టీకా కూడా వేసుకోలేదని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా కోటి 8 లక్షల మంది రెండు డోసులు వేసుకున్నారని, ప్రస్తుతం 60 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనా పాజిటివ్ రేటు చాలా తగ్గిందని, కరోనా మూడో వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
తెలంగాణలో కరోనా పాజిటివిటీ రేటు 0.4 శాతానికి తగ్గిపోయిందని ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్) శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 ప్రభుత్వ, 76 ప్రైవేటు కేంద్రాల్లో ఆర్టీపీసీఆర్, 1231 కేంద్రాల్లో రాపిడ్ యాంటీజెన్ పరీక్షలు జరుగుతున్నాయని వైద్యారోగ్యశాఖ పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ చికిత్సల కోసం 1,327 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 55,442 పడకలు అందుబాటులో ఉన్నాయని డీహెచ్ శ్రీనివాసరావు ఉన్నత న్యాయస్థానానికి నివేదించారు. ఆసుపత్రుల్లో ఐసీయూ, ఆక్సిజన్, సాధారణ పడకలు అన్నీ కలిపి 2.6 శాతం అంటే 1527 మాత్రమే నిండాయన్నారు. తెలంగాణలో మే 6 నుంచి జ్వర సర్వే కొనసాగుతోందని ఆయన తెలిపారు. మూడోదశలో పిల్లలకు ముప్పు ఎక్కువగా ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో చిన్నారుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 6 వేల పడకలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. వైద్య, పారామెడికల్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్రంలో 82 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 75 పని చేస్తున్నాయని, మరో 7 ఈ నెలలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. కొవిడ్ మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.50 వేల ఎక్స్గ్రేషియా చెల్లింపులకు ఏర్పాట్లు చేశామన్నారు. వైద్యారోగ్యశాఖ నివేదిక నేపథ్యంలో కొవిడ్ నియంత్రణ చర్యలపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం అన్నీ చేయలేదని ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!