Travel influencer: ఏడాది చిన్నోడు.. ఎంచక్కా తిరిగి సంపాదిస్తున్నాడు!
ఇప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నాడు.. ముద్దుముద్దు మాటలు చెప్తున్నాడు.. అయితేనేం, ఆ తప్పటడుగులు, ముద్దు మాటలతోనే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా మారిపోయాడు. నెలకు దాదాపు 75వేల రూపాయలు సంపాదించేస్తున్నాడు! అమెరికాకు చెందిన ఈ చిన్నోడి స్టోరీ ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది.
వాషింగ్టన్: ఇప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నాడు.. ముద్దుముద్దు మాటలు చెప్తున్నాడు.. అయితేనేం, ఆ తప్పటడుగులు, ముద్దు మాటలతోనే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా మారిపోయాడు. నెలకు దాదాపు 75వేల రూపాయలు సంపాదించేస్తున్నాడు! అమెరికాకు చెందిన ఈ చిన్నోడి స్టోరీ ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది.
2020 అక్టోబర్ 14న జన్మించిన ఆ బుడతడి పేరు బ్రిగ్స్. పుట్టిన మూడు వారాలకే తొలి విహార యాత్ర మొదలుపెట్టేశాడు. ఈ ఏడాదిలో 45 సార్లు విమానం ఎక్కి, అమెరికాలోని 16 రాష్ట్రాలను చుట్టేశాడు. అలాస్కాలో ఎలుగుబంట్లు, ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్లో తోడేళ్లు, కాలిఫోర్నియాలోని బీచ్లు.. తను వెళ్లిన ప్రతి రాష్ట్రంలోని అందమైన ప్రదేశాలను ఆస్వాదించాడు. జలపాతాల వద్ద జలకాలాడాడు. నదుల్లో ప్రయాణించాడు. ఈ విషయాలన్నింటినీ whereisbriggs అనే ఇన్స్టాగ్రాం ఖాతా ద్వారా పంచుకొని పాపులరయ్యాడు. బ్రిగ్స్ ఖాతాను ప్రస్తుతం 30 వేల మందికి పైగా అనుసరిస్తున్నారు. అతి పిన్నవయస్కుడైన ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్గా పేరుపొందిన ఈ చిన్నారి నెలకు వెయి డాలర్లు (సుమారు 75 వేలు)సంపాదిస్తున్నాడు!
అసలు ఈ పర్యటనలు చేయాలన్న ఆలోచన బ్రిగ్స్ వాళ్ల అమ్మ జెస్ది. ఆమె పార్ట్ టైమ్ టూరిస్ట్స్ అనే బ్లాగ్ నడిపేది. ప్రపంచాన్ని చుట్టిరావడానికి ఆమెకు బ్లాగ్ ద్వారా కొంత మొత్తం అందుతుంది. ‘నేను 2020లో గర్భం దాల్చినప్పుడు, ఇక నా కెరీర్ ముగిసిపోయిందని చాలా ఆందోళన చెందాను. చిన్నపిల్లలతో నా వృత్తిలో కొనసాగడం సాధ్యమా అనే ఆలోచనే అందుకు కారణం’ అని జెస్ మీడియాకు వెల్లడించారు. ‘అయితే నా భర్త, నేను ఎలాగైనా మా ట్రావెలింగ్ను కొనసాగించాలనుకున్నాం. బేబీ ట్రావెల్పై ఉన్న సోషల్ మీడియా ఖాతాల గురించి వెతికాం. అయితే నాకు ఒక్కటి కూడా దొరకలేదు. ఆ పనేదో నేను చేయాలనుకున్నా. అది సరదాగా, అకట్టుకునేలా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నా. అలాగే మొదటిసారి చిన్నారులతో ప్రయాణించే తల్లిదండ్రులకు ఎదురయ్యే ఇబ్బందులను వివరించాలనుకున్నా’ అంటూ ఆమె వివరించారు. అక్కడి నుంచే whereisbriggs పుట్టుకొచ్చిందన్నారు.
కొవిడ్ సమయంలో కూడా వీరి ప్రయాణం కొనసాగింది. ఎక్కువ రద్దీ లేని ప్రాంతాలను చూసుకొని, నిబంధనలు పాటిస్తూ వారు ముందుకెళ్లారు. ఇప్పుడు వారు యూరప్ ట్రిప్ ప్లాన్చేస్తున్నారు. మరోవిషయం ఏంటంటే.. ఈ బేబీ బ్రిగ్స్కు స్పాన్సర్ కూడా ఉన్నారు. ఈ చిన్నారికి డైపర్లు, వైప్స్ అందిస్తారట.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాబాయినే హతమార్చిన వారు.. మీరు వేలు కోసుకుంటే స్పందిస్తారా?: లోకేశ్
వైకాపా అరాచకాలు, అవినీతిపై దిల్లీలో పోరాడుతున్న ఉద్యమకారిణి కోవూరు లక్ష్మిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభినందించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామివార్లను తెదేపా అధినేత చంద్రబాబు దంపతులు దర్శించుకున్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ప్రొద్దుటూరులో టిడ్కో ఇళ్ల పునాదుల కూల్చివేత.. అడ్డుకున్న తెదేపా
వైయస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో టిడ్కో ఇళ్ల పునాదులను వైకాపా ప్రభుత్వం కూల్చివేసింది. ఈ విషయం తెలుసుకున్న తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి కూల్చివేతను అడ్డుకున్నారు. -
తెలంగాణ ప్రజలకు చల్లని కబురు.. మూడు రోజుల పాటు వర్షాలు
తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. -
ఎంపీ అభ్యర్థి మాధవీలతతో ఏఎస్సై ఆలింగనం.. సస్పెండ్ చేసిన సీపీ
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన సైదాబాద్ ఏఎస్సై ఉమాదేవి సస్పెండ్ అయ్యారు. -
కవితకు బెయిల్ ఇవ్వొద్దు: సీబీఐ
దిల్లీ మద్యం విధానం సీబీఐ కేసులో రౌస్ అవెన్యూ న్యాయస్థానంలో కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. -
కోనసీమ జిల్లాలో బోరు నుంచి మంటలు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో బోరు నుంచి మంటలు వచ్చాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ టెన్త్ ఫలితాలు.. రీవాల్యుయేషన్, సప్లిమెంటరీ పరీక్షల వివరాల కోసం క్లిక్ చేయండి
ఏపీ పదో తరగతి ఫలితాల్లో (AP SSC Results) 86.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. -
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు (AP SSC Results 2024) విడుదలయ్యాయి. -
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై మరో కేసు
భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్పై మరో కేసు నమోదైంది. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేశారు. -
తిరుమలలో వైభవంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం
తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ముడాపై మురిసిన తోడేళ్లు..!
మట్టి, ఇసుక, బుసక పేరిట వైకాపా శ్రేణులు దోపిడీకి పాల్పడుతున్నా ఎలాంటి చర్యలు ఉండవు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం పోర్టు అవసరాల కోసం తెదేపా ప్రభుత్వం రైతుల భూములను కొనుగోలు చేస్తే... -
‘నమాజు సమయంలో మమ్మల్ని గుర్తుపెట్టుకోండి’
ఎన్నికల్లో మతపరమైన అంశాలతో ప్రచారం చేయకూడదనే కఠిన నిబంధనలున్నా.. వైకాపా నేతలకు మాత్రం వర్తించడం లేదు. విచ్చలవిడిగా మతపరమైన అంశాలను జోడించి ప్రచారం చేస్తున్నారు. -
కమిటీల పేరుతో కాలయాపన
ప్రతి అయిదేళ్లకు ఒక సారి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించడం ఆనవాయితీ. ఒకవేళ ఇది ఆలస్యమైతే ఐఆర్ (మధ్యంతర భృతి) ప్రకటిస్తుంది. -
జగనన్న.. గూడు పుఠాణి
అన్నింట్లో అధినేతనే అనుసరించే కొందరు ప్రజాప్రతినిధులు జగనన్న కాలనీలకు భూసేకరణలోనూ చేతివాటం ప్రదర్శించారు. పేదలు నివాసం ఉండే ఇళ్లకు లోతట్టు ప్రాంతాల్లో భూములు సేకరించారు. వాటి మెరక పేరిట మట్టి మెక్కేసి వదిలేశారు. -
నాడు ‘అన్న’దానం... నేడు అధ్వానం
తెదేపా హయాంలో నగరాలు, పట్టణాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (22/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
-
అదరగొట్టిన జియో.. నికర లాభం ₹5,337 కోట్లు
-
కేజ్రీవాల్ ఆరోగ్యం.. మెడికల్ బోర్డు ఏర్పాటుకు కోర్టు ఆదేశం
-
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. ‘పిస్టల్’ కోసం నదిలో గాలింపు
-
వాళ్లతో గొడవ పడటం మంచిది కాదు: పూరి జగన్నాథ్
-
పవన్ తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా