AP News: కడపలో కూలిన మూడంతస్తుల భవనం

కడపలోని రాధాకృష్ణ నగర్‌లో వేకువజామున 4 గంటల సమయంలో మూడు అంతస్తుల

Updated : 21 Nov 2021 08:51 IST

కడప: కడపలోని రాధాకృష్ణ నగర్‌లో వేకువజామున 4 గంటల సమయంలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకున్న తల్లీ, ఇద్దరు పిల్లలను అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. తెల్లవారుజామున పెద్ద శబ్దం రావడంతో మొదటి అంతస్తులో ఉన్న మహిళ, ఇద్దరు పిల్లలు మినహా రెండో అంతస్తు నుంచి అందరూ బయటికి పరుగులు తీశారు.

శిథిలాల కింద చిక్కుకున్న తల్లీబిడ్డల్ని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఈ భవనానికి నగరపాలక అధికారులు మూడుసార్లు నోటీసులిచ్చినప్పటికీ యజమాని స్పందించలేదని తెలుస్తోంది. భవనం కూలినా ఎలాగోలా ప్రాణాలతో బయట పడ్డామని బాధితులు అంటున్నారు.
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని