AP Floods: వరద ముంపు నుంచి తేరుకోని తిరుపతి

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తిరుపతి నగరం ఇంకా తేరుకోలేదు. వర్షాలు తగ్గుముఖం పట్టి నాలుగు రోజులైనా తిరుపతితో పాటు

Updated : 23 Nov 2021 09:52 IST

తిరుపతి: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తిరుపతి నగరం ఇంకా తేరుకోలేదు. వర్షాలు తగ్గుముఖం పట్టి నాలుగు రోజులైనా తిరుపతితో పాటు చిత్తూరు జిల్లాలోని చాలా ప్రాంతాలు వరద ముంపును ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా తిరుపతిలోని చాలా కాలనీలు ఇప్పటికీ నీళ్లలోనే ఉన్నాయి. లక్ష్మీపురం కూడలి, సరస్వతీనగర్‌, మధురానగర్‌, శ్రీకృష్ణనగర్‌, ఉల్లిపట్టెడ, యశోదనగర్‌, ఆటోనగర్‌ ప్రాంతాల్లో చాలా ఇళ్లు వరద నీటిలో ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తిరుపతి నగర శివారులో ఉన్న చిగురువాడ సమీపంలో ప్రధాన రహదారికి గండిపడింది. స్వర్ణముఖి నది పొంగిపొర్లడంతో అటు తనపల్లి క్రాస్‌, ఇటు చిగురువాడ ప్రాంతాల నుంచి తిరుపతికి రాకపోకలు స్తంభించాయి. ఫలితంగా ఇక్కడికి చేరుకోవడానికి వందల కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి రావాల్సి వస్తోందంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

34వేల బస్తాలతో..

మరోవైపు రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువు లీకేజీకి అడ్డుకట్ట పడకపోవడంతో గండిని పూడ్చేందుకు తిరుపతి ఐఐటీకి చెందిన నిపుణులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దీంతోపాటు ప్రభుత్వ నిపుణుల బృందం ఇవాళ రాయలచెరువు ప్రాంతాన్ని సందర్శించనుంది. దాదాపు 35వేల ఇసుక- సిమెంట్‌ కలిపిన బస్తాలను లీకేజీ అవుతున్న ప్రాంతంలో వేసేందుకు అధికారులు ఏర్పా్ట్లు చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని