TS PGECET 2021: తెలంగాణ పీజీ ఈసెట్‌ ఫలితాలు విడుదల

ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో సీట్లు భర్తీ చేసేందుకు నిర్వహించే తెలంగాణ పీజీ ఈసెట్‌ ఫలితాలు వెల్లడయ్యాయి.

Updated : 06 Sep 2021 15:38 IST

హైదరాబాద్: ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో సీట్లు భర్తీ చేసేందుకు నిర్వహించే తెలంగాణ పీజీ ఈసెట్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈసెట్‌ కన్వీనర్‌ ఆచార్య లక్ష్మీనారాయణ ఓయూలో ఫలితాలు విడుదల చేశారు. గత నెల 11 నుంచి 14వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలకు 22,834 మంది హాజరయ్యారు. హైదరాబాద్‌, వరంగల్‌లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 17,864 మంది, వరంగల్‌లో 5,323 మంది పరీక్ష రాసినట్లు లక్ష్మీనారాయణ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని