తాత్కాలికంగా కాచిగూడ నుంచి ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోని ఆటోమాటిక్‌ కోచ్‌ వాష్‌ ప్లాంట్‌ (ఏసీడబ్ల్యూపీ) నిర్మాణం నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు......

Published : 14 Mar 2021 01:01 IST

హైదరాబాద్‌‌: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఆటోమాటిక్‌ కోచ్‌ వాష్‌ ప్లాంట్‌ (ఏసీడబ్ల్యూపీ) నిర్మాణం నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి రోజూ సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరే మూడు ప్రత్యేక రైళ్ల రాకపోకల విషయంలో తాత్కాలిక మార్పులు చేశారు. ఈ నెల 15 నుంచి 24వ తేదీ వరకు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌, అజంతా ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌- దనపూర్‌ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్‌ నుంచి కాకుండా కాచిగూడ నుంచి తాత్కాలికంగా రాకపోకలను కొనసాగిస్తాయని ప్రకటనలో వెల్లడించారు. దీని ప్రకారం సికింద్రాబాద్‌ నుంచి హావ్‌డా వెళ్లే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ రైలు (02704) ఈ నెల 15 నుంచి కాచిగూడ నుంచి బయల్దేరనుంది. అలాగే, సికింద్రాబాద్‌ - దనపూర్‌ (02787),  సికింద్రాబాద్‌ -మన్మాడ్‌ ప్రత్యేక రైళ్లు (అజంతా ఎక్స్‌ప్రెస్ - 07064) రైలు కూడా నిర్ణీత కాలంలో సికింద్రాబాద్‌కు బదులు కాచిగూడ నుంచి తాత్కాలికంగా రాకపోకలు కొనసాగిస్తాయని పేర్కొన్నారు. ఈ మూడు రైళ్లు తిరుగు పయనంలోనూ కాచిగూడకే చేరుకుంటాయని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని