తాత్కాలికంగా కాచిగూడ నుంచి ఫలక్నుమా ఎక్స్ప్రెస్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని ఆటోమాటిక్ కోచ్ వాష్ ప్లాంట్ (ఏసీడబ్ల్యూపీ) నిర్మాణం నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు......
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆటోమాటిక్ కోచ్ వాష్ ప్లాంట్ (ఏసీడబ్ల్యూపీ) నిర్మాణం నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి రోజూ సికింద్రాబాద్ నుంచి బయలుదేరే మూడు ప్రత్యేక రైళ్ల రాకపోకల విషయంలో తాత్కాలిక మార్పులు చేశారు. ఈ నెల 15 నుంచి 24వ తేదీ వరకు ఫలక్నుమా ఎక్స్ప్రెస్, అజంతా ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్- దనపూర్ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ నుంచి కాకుండా కాచిగూడ నుంచి తాత్కాలికంగా రాకపోకలను కొనసాగిస్తాయని ప్రకటనలో వెల్లడించారు. దీని ప్రకారం సికింద్రాబాద్ నుంచి హావ్డా వెళ్లే ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలు (02704) ఈ నెల 15 నుంచి కాచిగూడ నుంచి బయల్దేరనుంది. అలాగే, సికింద్రాబాద్ - దనపూర్ (02787), సికింద్రాబాద్ -మన్మాడ్ ప్రత్యేక రైళ్లు (అజంతా ఎక్స్ప్రెస్ - 07064) రైలు కూడా నిర్ణీత కాలంలో సికింద్రాబాద్కు బదులు కాచిగూడ నుంచి తాత్కాలికంగా రాకపోకలు కొనసాగిస్తాయని పేర్కొన్నారు. ఈ మూడు రైళ్లు తిరుగు పయనంలోనూ కాచిగూడకే చేరుకుంటాయని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ