ఆ దేశంలో ఆనందం ఎక్కువ..!
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ విజృంభిస్తున్నా.. సంతోషకరమైన దేశాలలో ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలిచిందని ఐక్యరాజ్య సమితి ఓ విభాగం(యూఎన్ఎస్) ప్రకటించింది. ఈ మేరకు 149 దేశాల్లోని ప్రజల అభిప్రాయాలను సేకరించిన అనంతరం యూఎన్ఎస్ వార్షిక నివేదికను విడుదల చేసింది. ఈ క్రమంలో గత నాలుగు సంవత్సరాలుగా ఫిన్లాండ్ ప్రజలు ఆనందంగా గడుపుతున్నట్లు సాధారణ గణాంకాలను వెల్లడించింది...
సంతోషకరమైన దేశాల జాబితా వెల్లడి..
ఫిన్లాండ్: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ విజృంభిస్తున్నా.. సంతోషకరమైన దేశాలలో ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలిచిందని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. 149 దేశాల్లోని ప్రజల అభిప్రాయాలను సేకరించిన అనంతరం వార్షిక నివేదికను విడుదల చేసింది. నాలుగేళ్లుగా ఫిన్లాండ్ ప్రజలు అందరికన్నా ఎక్కువ ఆనందంగా గడుపుతున్నట్లు వెల్లడించింది. ఐరోపా దేశాలైన డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఐస్లాండ్, నెదర్లాండ్స్లు వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయని వెల్లడించింది.
గతేడాదితో పోలిస్తే సంతోషకరమైన దేశాల్లో న్యూజిలాండ్ 9వ స్థానంలోకి రాగా... జర్మనీ 17 నుంచి 13వ స్థానానికి, ఫ్రాన్స్ 2 నుంచి 21 స్థానానికి చేరినట్లు నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో ఆఫ్రికా దేశాలైన లెసోతో, బోట్స్వానా, రువాండా, జింబాబ్వే చివరి స్థానాల్లో ఉన్నాయి. కాగా ఈ సంవత్సరానికి గానూ సంతోషంగా లేని (అన్హ్యాపీ) దేశాల్లో అఫ్గానిస్థాన్ తొలి స్థానంలో నిలిచిందని సర్వే అధికారులు చెబుతున్నారు.
దేశ ప్రజల ఆనందం, వ్యక్తిగత స్వేచ్ఛ, సామాజిక బాధ్యత, దేశ జీడీపీ, అవినీతి స్థాయులను పరిగణనలోకి తీసుకొని ఈ నివేదిక రూపొందించారు. తొమ్మిదేళ్లుగా సంతోషకరమైన దేశాల జాబితాలను విడుదల చేస్తున్నామని ఐరాస పరిశోధకుడు హిల్లివెల్ ఓ ప్రకటనలో తెలిపారు. ‘కరోనా కాలంలోనూ.. ఫిన్లాండ్లో ఎక్కువ శాతం జనాభా ఆనందంగా జీవిస్తున్నారు. మహమ్మారి సమయంలో ఫిన్లాండ్ ప్రజలు వారి జీవనోపాధిని కాపాడుకొనేందుకు చాలా కృషి చేస్తున్నారు. ఇక్కడి ప్రజలు ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నారు. అది వారి ముఖాల్లో కనిపించింది. ఇక్కడ విస్తారమైన అడవులు, వేలాది సరస్సులు , నిశ్శబ్ద వాతావరణం ఉండటం ప్రజల జీవనానికి అనుకూలం ’అని హిల్లివెల్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM