వేలానికి హిట్లర్ వస్తువు: ఇలాంటివి కూడా కొంటారా!
ఇంత కథ ఉన్న, హిట్లర్ వాడిన ఆ అపురూప వస్తువు ఏంటంటే..
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచాన్ని గడగడలాడించిన జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్. రెండో ప్రపంచయుద్ధానికి ప్రధాన కారకుడిగా ఈయన పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో రెండో ప్రపంచ యుద్ధానికి చెందిన ఓ వస్తువు.. అది కూడా హిట్లర్ ‘ఉపయోగించింది’ వేలానికి వచ్చింది. యుద్ధంలో పాల్గొన్న ఓ సైనికుడు.. హిట్లర్ వ్యక్తిగత గదిలోంచి దానిని ‘దోచుకున్నాడట.’ కాగా, ఆ సైనికుడి వారసులు ఇప్పుడు దానిని వేలం వేయాలని నిర్ణయించుకున్నారు. ఇది ప్రస్తుతం మేరీలాండ్ రాష్ట్రంలోని అలెగ్జాండర్ హిస్టారికల్ ఆక్షన్స్ వేలం సంస్థ ఆధీనంలో ఉంది. దానికి 15 వేల డాలర్లు వస్తాయని సదరు వేలం సంస్థ భావిస్తోంది.
నీకేది కావలిస్తే అది తీసుకో..
హిట్లర్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బవేరియా దేశంలో ఆల్ప్స్ పర్వతాల వద్దనున్న బెర్చ్టెస్గాడెన్ పట్టణ సమీపంలో కొంతకాలం బసచేశాడట. ఆ సమయంలో హిట్లర్ ఇంటిని చేరుకున్న అమెరికన్ సైనికుల్లో బోర్చ్ అనే వ్యక్తి ఒకరు. హిట్లర్ ఇంట్లో ‘నీకేది కావలిస్తే అది తీసుకో..’ అని ఓ సైనిక ఉన్నతాధికారి అతనికి అవకాశమిచ్చాడట. ఐతే అప్పటికే బాంబు దాడితో ఆ ఇల్లు పూర్తిగా నేలమట్టంకావడంతో.. ఇంకేమీ లభించక, దొరికిన ఆ వస్తువునే తీసుకున్నాడట. హిట్లర్ వాడిన ఆ అపురూప వస్తువు ఏంటంటే.. రెండు భాగాలుగా ఉన్న చెక్క టాయిలెట్ సీటు! హిట్లర్ మౌంటెయిన్ అనే పుస్తకంలో కూడా ఈ సంఘటనకు సంబంధించి ప్రస్తావన ఉంది. దాని కాపీని కూడా ఈ వేలంలో దానిని సొంతం చేసుకున్న వారికి అందచేస్తారు.
అది తమ ఇంటి బేస్మెంట్లో చాలా కాలం గుర్తింపు లేకుండానే పడిఉండేదని.. సదరు సైనికుడి ఆయన కుమారుడు వివరించాడు. అనంతరం దాని విలువ తెలియటంతో వారు సదరు వేలం సంస్థను సంప్రదించారు. కళ్లను ఇట్టే ఆకట్టుకునే వస్తువుల్లో ఇదీ ఒకటని వేలం సంస్థ పేర్కొంది.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి