అదిగో పెద్దపులి..!

రాజస్థాన్‌ రాష్ట్రం సవాయ్‌ మాధాపూర్‌ జిల్లాలోని రణతంబోర్‌ అటవీ ప్రాంతంలో ఓ పులి కలకలం సృష్టించింది. గణేష్‌ మార్గ్‌ నుంచి జోగీ మహల్‌కు వెళుతున్న కొందరు పర్యాటకులు ఓ పార్కులో ఆగగా...

Updated : 25 Jan 2021 12:37 IST

జైపూర్‌: రాజస్థాన్‌ రాష్ట్రం సవాయ్‌ మాదాపూర్‌ జిల్లాలోని రణతంబోర్‌ అటవీ ప్రాంతంలో ఓ పులి కలకలం సృష్టించింది. గణేష్‌ మార్గ్‌ నుంచి జోగీ మహల్‌కు వెళుతున్న కొందరు పర్యాటకులు ఓ పార్కులో ఆగగానే ఓ పులి అకస్మాత్తుగా గోడపైకి దూకి వారికి అతిసమీపంగా వచ్చింది. దీంతో పర్యాటకులు బెంబేలెత్తిపోయారు. అయితే, జిప్సీ వాహనంలో కూర్చున్న ఆ పర్యాటకులకు హాని తలపెట్టకుండా తిరిగి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవీ చదవండి...

చీమల్లో రెండు కొత్త ఉప జాతులు

టాక్‌ షో దిగ్గజం ల్యారీ కింగ్‌ కన్నుమూత

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని