iPhone 13: ఐఫోన్ 13 ప్రమోషనల్ వీడియోలో ఏ పాట వస్తుందంటే..?
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ యాపిల్ ఏ కొత్త మొబైల్ను మార్కెట్లోకి తీసుకొచ్చినా స్మార్ట్ఫోన్ అభిమానుల దృష్టంతా దానిపైనే ఉంటుంది
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ యాపిల్ ఏ కొత్త మొబైల్ను మార్కెట్లోకి తీసుకొచ్చినా స్మార్ట్ఫోన్ అభిమానుల దృష్టంతా దానిపైనే ఉంటుంది. తాజాగా మంగళవారం ఆవిష్కరించిన ఐఫోన్ 13 సిరీస్ కూడా అందర్నీ తెగ ఆకట్టుకుంటోంది. ఓవైపు ఫోన్ ఫీచర్స్పైనా నెట్టింట్లో చర్చ జరుగుతుంటే మరోవైపు ఓ పాటపైనా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. పాటపై చర్చించుకోవడమేంటని ఆలోచిస్తున్నారా? నిజమే, ఐఫోన్ 13 ఫోన్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రమోషనల్ వీడియోను వేశారు. ఆ వీడియోలో ‘దమ్ మారో దమ్’ అనే ట్యూన్ను ప్లే చేశారు. దానిపైనే సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.
ట్విటర్ యూజర్ ఈ ప్రమోషనల్ వీడియోను షేర్ చేస్తూ.. ‘యాపిల్ దమ్ మారో దమ్ పాటను ఉపయోగిస్తోంది!’ అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియోలో మొబైల్ ఫ్యూచర్స్ గురించి వివరిస్తుండగా బ్యాక్గ్రౌండ్లో దమ్ మారో దమ్ ట్యూన్ వస్తోంటుంది. కాగా..1971లో ఈ పాటను ఆర్డీ బర్మన్ స్వరపరచగా ఆశా భోంస్లే ఆలపించారు. దీన్ని యాపిల్ ఈవెంట్ 2021లో ప్లే చేయడంతో సోషల్ మీడియాలో సందడి నెలకొంది. ప్రపంచ వేదికపై సుపరిచితమైన ట్యూన్ విన్నామని బాలీవుడ్ అభిమానులు స్పందిస్తున్నారు. ఇదిలా ఉండగా భారత్లో ఈనెల 17 నుంచి ఐఫోన్ ప్రీ ఆర్డర్ మొదలవుతుంది. 24వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయి. ఐఫోన్ 13 మినీ రూ.69,900, ఐఫోన్ 13 రూ.79,900, ఐఫోన్ 13 ప్రో రూ.1,19,900, 13 ఐఫోన్ ప్రో మ్యాక్స్ రూ.1,29,900 నుంచి ప్రారంభమవుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!