‘యప్ టీవీ’కి ఐపీఎల్ ప్రసార హక్కులు
ప్రపంచ వ్యాప్తంగా పేరెన్నికగన్న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫం ‘యప్ టీవీ’ ఐపీఎల్ 2020 ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. ఐపీఎల్ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు మొత్తం 60 మ్యాచులను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో స్టేడియం వెళ్లి మ్యాచ్లు చూసేందుకు..
ఇంటర్నెట్డెస్క్: ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫం ‘యప్ టీవీ’ ఐపీఎల్ 2020 ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. ఐపీఎల్ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు మొత్తం 60 మ్యాచులను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో స్టేడియం వెళ్లి మ్యాచ్లు చూసేందుకు ఎవరూ అంతగా ఆసక్తి కనబర్చడం లేదు. దీంతో ఓటీటీ ప్లాట్ఫాంకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటికే యప్ టీవీకి విశేష ఆదరణ లభిస్తుండగా.. ఐపీఎల్ 2020తో మరింత పెరుగుతుందని సంస్థ యాజమాన్యం భావిస్తోంది. ఆస్ట్రేలియా, యూరప్, మలేసియా, ఆగ్నేయ ఆసియా, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవులు, మధ్య ఆసియా, దక్షిణఅమెరికా తదితర చోట్ల డ్రీమ్ 11 ఐపీఎల్ 2020 మ్యాచ్లను యప్ టీవీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
తాజా ఐపీఎల్ సీజన్తో యప్ టీవీ మరింత మందికి చేరువయ్యే అవకాశముందని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో ఉదయ్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ‘‘గత కొన్నేళ్లుగా ఐపీఎల్ను విశేషంగా ఆదరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాజా ఐపీఎల్ కొంత సంచలనాలకు తావిస్తుంది. ఇన్నాళ్లు కిక్కిరిసిన స్టేడియంలో, ప్రేక్షకుల కేరింతల మధ్య మ్యాచ్లు సాగేవి. కానీ, కుటుంబ సభ్యుల మధ్య కూర్చునే అంతటి ఆనందాన్ని పొందేలా యప్ టీవీ మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చేయబోతోంది. దీంతో ప్రేక్షకుల అనుభూతి రెట్టింపవుతుంది.అంతేకాకుండా యప్ టీవీ సత్తాను నిరూపించుకునేందుకు ఈ ఐపీఎల్ మరింత దోహదం చేస్తుందని భావిస్తున్నాం’’ అని ఉదయ్రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు.
దశాబ్ద కాలంగా ప్రపంచ వ్యాప్తంగా భారతీయులకు సేవలందిస్తున్న ఈ సంస్థ.. 14 ప్రముఖ భారతీయ భాషల నుంచి దాదాపు 250కి పైగా టీవీ ఛానళ్లను, 3000లకు పైబడి సినిమాలను , వందకు పైగా టీవీ షోలను ప్రసారం చేస్తోంది. ప్రపంచ నెంబర్ ఓటీటీ ఫ్లాట్ఫాంగా ఎదిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!