Health: టీ తాగితే గుండెకు మేలేనా?
చాలామందికి ‘టీ’ తాగకపోతే ఆ రోజే ప్రారంభం కాదు. నిద్ర లేచీ లేవగానే తేనీటి చుక్క నాలిక మీద పడాల్సిందే. మరికొందరు రోజులో కనీసం నాలుగైదు సార్లు చాయ్ తాగేస్తుంటారు.
ఇంటర్నెట్డెస్క్: చాలామందికి ‘టీ’ తాగకపోతే ఆ రోజే ప్రారంభం కాదు. నిద్ర లేచీ లేవగానే తేనీటి చుక్క నాలిక మీద పడాల్సిందే. మరికొందరు రోజులో కనీసం నాలుగైదు సార్లు చాయ్ తాగేస్తుంటారు. లేకుంటే ఏదో కోల్పోయినట్లుంటుందని చెబుతుంటారు. అయితే ఇలా ఎక్కువ సార్లు టీ తాగడం మంచిదేనా? దీనివల్ల గుండెపై ఏమైనా ప్రభావం పడుతుందా?
చాయ్ తాగడం వల్ల ఓ రకంగా గుండెకు మేలే జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శాస్త్రీయంగానూ ఇది నిరూపితమైంది. ఎక్కువగా టీ తాగుతున్న దాదాపు లక్ష మందిపై ఏడేళ్లపాటు శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. సాధారణ ప్రజలకంటే వీరిలో గుండె సంబంధిత వ్యాధులు 20 శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఒకవేళ గుండె వ్యాధులు వచ్చినా మరణించే సందర్భాలు 22 శాతం తక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. ఈ మేరకు యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో కథనం ప్రచురితమైంది. మరోవైపు జపాన్ దేశానికి చెందిన దాదాపు 40 వేల మందిపై శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు చేపట్టింది. రోజుకు కనీసం 5 కప్పుల గ్రీన్ టీ తీసుకున్నవారిలో గుండెపోటుతో మరణించే అవకాశాలు దాదాపు 26 శాతం తక్కువగా ఉన్నట్లు అందులో తేలింది. ఈ మేరకు అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్లో కథనం ప్రచురితమైంది.
గుండెకు టీ ఎలా మేలు చేస్తుంది?
టీ తాగడం వల్ల గుండెకు ఏవిధంగా మంచిదో తెలుసుకునే ముందు.. అధిక రక్తపోటు హృదయాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవాలి. గుండె నుంచి శరీర భాగాలకు, శరీర భాగాల నుంచి గుండెకు నిరంతరం రక్తం సరఫరా అవుతుంది. రక్తపోటు ఎక్కువగా ఉండటం వల్ల రక్తనాళాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఫలితంగా అవి పగిలిపోవడం, చిల్లులు పడటం లాంటి సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా ఒత్తిడికి గురైన సందర్భాల్లో అధికంగా రక్తం సరఫరా అవుతుంది. అలాంటప్పుడు అవసరాన్ని బట్టి రక్తనాళాలు కొంచెం సాగుతూ ఉంటాయి. కానీ అధిక రక్తపోటు ఉన్నవారిలో అలా జరగదు. రక్తనాళాలు కుంచించుకుపోయి రక్తం గడ్డ కడుతుంది. ఫలితంగా ఛాతి భాగంలో నొప్పితోపాటు, హృదయ సంబంధమైన వ్యాధులు వచ్చేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు హఠాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది.
టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇందులో ఉండే పాలిఫెనాల్ పదార్థాలు యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేసి రక్తనాళాలను వదులుగా ఉంచేందుకు తోడ్పడుతాయి. అంతేకాకుండా రక్తకణాల లోపలి పొరల్లో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ను ఉత్తేజపరచేందుకు ఈ పాలిఫెనాల్ ఉపయోగపడుతుంది. ఫలితంగా రక్త ప్రసరణ సజావుగా సాగి హృదయం ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది. ప్రస్తుతం రకరకాల చాయ్లు అందుబాటులో ఉన్నాయి. గ్రీన్ టీ శరీరంలోని అనవసరపు కొవ్వును కరిగిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని క్రమబద్ధీకరిస్తుంది. మరోవైపు రక్తంలో పేరుకుపోయిన ప్రమాదకరమైన కొవ్వు కణాలను కరిగించేందుకు బ్లాక్ టీ ఎంతగానో సహాయపడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా