Mobiles : మొబైల్కు బానిసై.. మానసిక రోగిగా మారి..!
నేటి యువత మొబైల్ ఫోన్లకు బానిసలవుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. క్షణం తీరిక లేకుండా, తెలియకుండానే తిండి, నిద్ర మానేసి చరవాణిని ఓ వ్యసనంలా మార్చుకుంటున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అంటూ సామాజిక మాధ్యమాల్లో గంటల తరబడి కాలక్షేపం చేస్తున్నారు. మొబైల్ వినియోగానికి అతిగా అలవాటు పడిన ఓ యువకుడు చివరికి..
ఇంటర్నెట్డెస్క్ : నేటి యువత మొబైల్ ఫోన్లకు బానిసలవుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. క్షణం తీరిక లేకుండా, తెలియకుండానే తిండి, నిద్ర మానేసి చరవాణిని ఓ వ్యసనంలా మార్చుకుంటున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అంటూ సామాజిక మాధ్యమాల్లో గంటల తరబడి కాలక్షేపం చేస్తున్నారు. మొబైల్ వినియోగానికి అతిగా అలవాటు పడిన ఓ యువకుడు చివరికి మానసిక రోగిలా మారిపోయిన సంఘటన రాజస్థాన్లో జరిగింది.సెల్ఫోన్లు మానవసంబంధాలను దూరం చేస్తాయనడానికి ఈ ఘటనే నిలువెత్తు నిదర్శనం.
కొంతమంది పక్కవారితో సంబంధం లేకుండా.. గంటలకు గంటలు ఫోన్తోనే కాలం వెళ్లదీస్తుంటారు. రాజస్థాన్లోనూ ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. మొబైల్కు బానిసైన ఓ యువకుడు చివరికి మానసిక రోగిలా మారిపోయి, బంధువులనే గుర్తుపట్టలేని స్థితికి వెళ్లాడంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజస్థాన్లోని చురూ ప్రాంతానికి చెందిన అక్రమ్కు ఫోన్ అలవాటు ఎక్కువగా ఉండేది. మొబైల్ వినియోగిస్తూ రాత్రిళ్లు నిద్ర కూడా మానేసేవాడు.రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఫోన్ చూస్తూనే ఉంటాడని అతడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కొద్ది రోజులుగా అక్రమ్ వింతగా ప్రవర్తించడాన్ని గుర్తించిన తల్లిదండ్రులు మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అతడిని పరీక్షించిన వైద్యులు నిద్ర లేకపోవడం కారణంగా మానసిక రోగిగా మారాడని, అతడి ఆరోగ్యం క్షీణించిందని తెలిపారు. ప్రస్తుతం అక్రమ్కు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. చికిత్స సమయంలోనూ ఫోన్ కావాలని అడుగుతున్నాడని వైద్యులు చెబుతున్నారు.
అక్రమ్కు 8 నెలల క్రితం నిశ్చితార్ధమైంది.ఎప్పుడూ ఫోన్ చూస్తూ ఉండటంతో తల్లిదండ్రులు అడిగితే తనకు కాబోయే భార్యతో చాట్ చేస్తున్నాననేవాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఏమీ తినకుండా, తాగకుండా గంటల తరబడి ఫోన్ చూసేవాడని చెప్పారు. ఇప్పుడు తమను కూడా గుర్తు పట్టడంలేదని, ఆహారం కూడా తీసుకోవడం లేదని అన్నారు. అక్రమ్ వింత చేష్టలకు ఒక్కోసారి భయభ్రాంతులకు గురయ్యామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..
-
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
-
తెదేపా అభ్యర్థులకు ఈనెల 21న బీఫామ్లు ఇవ్వనున్న చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
బేబీ ఫుడ్లో చక్కెర.. వివరణ ఇచ్చిన నెస్లే ఇండియా
-
మంగళగిరిలో నారా లోకేశ్ నామినేషన్.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ