Jammu and Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త వ్యూహం..!
కశ్మీర్లో ఉగ్రవాదుల అరచాకం పెరిగిపోతోంది.. గత కొన్నేళ్లుగా భద్రతా దళాలు జల్లెడ పట్టి ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. దీంతో ఉగ్రవాదులు వ్యూహం మార్చారు. ఇప్పుడు చిన్న ఆయుధాలతో పార్ట్టైమ్ ఉగ్రవాదులను దాడులకు పురిగొల్పుతున్నారు.
భారీగా పెరిగిన చిన్న ఆయుధాల వినియోగం..!
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
కశ్మీర్లో ఉగ్రవాదుల అరాచకం పెరిగిపోతోంది.. గత కొన్నేళ్లుగా భద్రతా దళాలు జల్లెడ పట్టి వారిని మట్టుబెట్టాయి. దీంతో ఉగ్రవాదులు వ్యూహం మార్చారు. ఇప్పుడు చిన్న ఆయుధాలతో పార్ట్టైమ్ ముష్కరులను దాడులకు పురిగొల్పుతున్నారు. వీరు వలసకూలీలే లక్ష్యంగా దాడులు చేసి తప్పించుకొంటున్నారు. దీనికితోడు స్థానిక ఉగ్రవాదుల మనోస్థైర్యం పెంచేందుకు పాక్ సైన్యంలోని అత్యున్నత కమాండోలు నేరుగా శిక్షణ ఇవ్వడం లేదా కశ్మీర్లో దాడుల్లో పాల్గొనడం వంటివి చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి.
ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకొని వచ్చిన వారిపై ఉగ్రవాదులు గురిపెడుతున్నారు. ఆదివారం మరో ఇద్దరు వలస కార్మికుల ప్రాణాలు బలిగొన్నారు. దీంతో ఈ నెలలో అమాయకులే లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడుల్లో మరణించిన పౌరుల సంఖ్య 11కు చేరింది. కుల్గాంలోని వానిపోహ్ వద్ద కూలీలపై ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు స్థానికేతరులు మరణించగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టి గాలింపు చర్యలు చేపట్టాయి. అంతకు ముందు కశ్మీర్ లోయలోని శ్రీనగర్లో పానీపూరి అమ్ముకుంటూ జీవనం సాగించే అరబింద్ కుమార్ షా (బిహార్), పుల్వామాలో సిరాజ్ అహ్మద్ అనే కార్పెంటర్ (ఉత్తరప్రదేశ్)ను కాల్చి చంపారు. ఇప్పటి వరకు మరణించిన వారిలో ఐదుగురు ఇతర రాష్ట్రాలకు చెందిన వారున్నారు.
పౌరులు, కశ్మీరీ మైనార్టీలపై ఉగ్రవాదులు గురిపెట్టారని గుర్తించిన వెంటనే భద్రతా దళాలు అప్రమత్తమై జమ్ము కశ్మీర్లో 900 మంది ఉగ్ర సానుభూతిపరులను అదుపులోకి తీసుకొన్నాయి. అంతేకాదు మొత్తం 9 ఎన్కౌంటర్లు చేపట్టి 13 మంది ఉగ్రవాదులను హతమార్చాయి. గత 24 గంటల్లో శ్రీనగర్లో ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు ఐజీ విజయ్కుమార్ తెలిపారు.
అతిపెద్ద ఎన్కౌంటర్ వెనక పాక్ కమాండోలు..
పదిహేనేళ్ల కాలంలో కనీవినీ ఎరుగని స్థాయిలో పూంచ్ జిల్లాలోని పీర్పంజాల్ రేంజిలో ఎన్కౌంటర్ జరిగింది. అక్టోబర్ 10-11 రాత్రి డేరా వలీ గలీ ప్రాంతంలో మొదలైన ఈ ఎన్కౌంటర్ దాదాపు వారానికి పైగా కొనసాగింది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు జేసీవో అధికారులతో సహా 9 మంది సైనికులు మరణించారు. ఇక్కడ దాదాపు 9 కిలోమీటర్ల మేరకు దట్టంగా విస్తరించిన అడవిలో ఉగ్రవాదులు నక్కి దాడి చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉగ్రవాదుల మృతదేహాలు దళాలకు కనిపించలేదు. ఇక్కడ తొలుత అక్టోబర్ 10వ తేదీన జరిగిన దాడిలో ఒక జేసీవోతో సహా ఐదుగురు సైనికులు మృతి చెందారు. ఇదే ఆపరేషన్లో గురువారం మరో ఒక జేసీవో సహా ఇద్దరు సైనికులు అదృశ్యమయ్యారు. వీరి మృతదేహాలను రెండ్రోజుల తర్వాత దళాలు గుర్తించి అతికష్టం మీద స్వాధీనం చేసుకొన్నాయి.
దాదాపు ఎనిమిది రోజుల నుంచి ఉగ్రవాదులు అడవుల్లో నక్కి భద్రతా దళాలకు భారీగా నష్టాన్ని కలుగజేస్తున్న తీరుపై సైన్యం అనుమానం వ్యక్తం చేస్తోంది. వీరిలో పాకిస్థాన్ సైన్యంలో అత్యున్నత కమాండో దళాలకు చెందిన వారు కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. ఎన్కౌంటర్ ముగిసేవరకు దీనిని ధ్రువీకరించలేమని చెబుతున్నారు. ఇప్పటికీ ఎన్కౌంటర్ కొనసాగుతోంది.
ప్రస్తుతం ఉగ్రవాదులు తప్పించుకోలేకుండా ఉచ్చులో ఇరికించినట్లు దళాలు చెబుతున్నాయి. ఇప్పటికే పారా కమాండోలతోపాటు హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగాయి. త్వరలోనే ఈ సుదీర్ఘ ఎన్కౌంటర్ ముగుస్తుందని అధికారులు చెబుతున్నారు.
శీతాకాలం చొరబాట్లు మొదలు కావడంతో..
ఫిబ్రవరిలో భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీంతో ఉగ్రవాదులను భారత్లోకి పంపించే సమయంలో పాక్ సైన్యం కాల్పులు జరపడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో మూడు నెలల క్రితమే చొరబాటు యత్నాలకు విరామం ఇచ్చారు. కానీ, ఇప్పుడు శీతాకాలం సమీపిస్తుండటంతో ప్రకృతి సహకరిస్తుండటంతో పాక్ సైన్యం చొరబాట్లకు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే పాక్ ఆక్రమిత కశ్మీర్లో తిష్ఠవేసిన ఉగ్రమూకలు చొరబాట్లకు యత్నాలు మొదలుపెట్టాయి.
ఉగ్రవాదుల కంటే ఆయుధాలు ఎక్కువ..
పాక్ సైన్యం పంపించే ఉగ్రవాదుల సంఖ్య కంటే వారికి అందజేసే ఆయుధాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది. అంటే స్థానిక ఉగ్రవాదుల వద్ద ఆయుధ కొరత ఉందని అర్థం. దీంతో వారు చిన్న ఆయుధాల వినియోగంపై మొగ్గారు. గత సెప్టెంబర్లో సైన్యం ముగ్గురు చొరబాటుదారుల్ని మట్టుబెట్టింది. వీరి వద్ద ఐదు ఏకే రైఫిల్స్, ఎనిమిది పిస్తోళ్లు, రెండు ఐఈడీలు, 69 గ్రనేడ్లు ఉన్నాయి. ఇది కశ్మీర్లో ఉన్న స్థానిక ఉగ్రవాదులకు పాక్ నుంచి ఆయుధాలు అందుతున్నాయనడానికి బలమైన ఆధారం.
పార్ట్టైమ్ లేదా హైబ్రీడ్ ఉగ్రవాదం..
భద్రతా దళాల నిఘాలో లేని వ్యక్తులు ఇటీవల ఎక్కువగా దాడులు చేసినట్లు తేలింది. వీరంతా కరుడుగట్టిన ఉగ్రవాదుల వలే దళాల నిఘా రాడార్లో ఉండరు. వీరు కేవలం అప్పటికప్పుడు ఒకట్రెండు దాడులు చేసి మళ్లీ సాధారణ జీవితంలోకి వెళ్లిపోతారు. గత రెండు వారాలుగా జరిగిన ఏడుగురు పౌరుల హత్యల్లో పిస్తోల్స్తో దాడి చేసిన నిందితుల్లో ఎక్కువ మంది సెక్యూరిటీ ఫోర్స్ల నిఘాలో లేరని తేలింది. వీరి శిక్షణ స్థానికంగానే జరుగుతోంది.
ముప్పుగా మారుతున్న చిన్న ఆయుధాలు..
హైబ్రీడ్ ఉగ్రవాదులు ఎక్కువగా చిన్న ఆయుధాలనే వాడుతున్నారు. కశ్మీర్లో ఈ ఒక్క ఏడాదే ఇప్పటి వరకు 97 పిస్తోళ్లను స్వాధీనం చేసుకోవడం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. పాకిస్థాన్ కూడా డ్రోన్ల నుంచి జారవిడిచేందుకు పిస్తోళ్లు, గ్రనేడ్లు అనుకూలంగా ఉంటున్నాయి. కేవలం ప్రజల్లో పరస్పర నమ్మకాన్ని దెబ్బతీసి భయానక వాతావరణం సృష్టించడమే దీని లక్ష్యం. ఇటీవల గమనిస్తే.. ఐఈడీ పేలుళ్ల వంటి భారీ దాడులను రెండేళ్లుగా ఉగ్రవాదులు పెద్దగా నిర్వహించడంలేదు. ఇది వారి వ్యూహాంలో మార్పునకు సంకేతం.
సాధారణంగా లక్ష్యంగా పెట్టుకొన్న వ్యక్తిని చంపడానికే పిస్తోళ్లు, గ్రనేడ్లను వినియోగిస్తారు. గతేడాది అక్టోబర్ 15 వరకు 203 పిస్తోళ్లను ,152 ఏకే రైఫిల్స్ను స్వాధీనం చేసుకొన్నట్లు సైన్యం తేలిపింది. ప్రతి ఎన్కౌంటర్లో దళాలు ఈ చిన్న ఆయుధాలను స్వాధీనం చేసుకొంటూనే ఉన్నాయి. ఒక్కో పిస్తోల్కు 10 రౌండ్ల తూటాల చొప్పున కేటాయిస్తున్నారు. అదే భారీ రైఫిల్కు 66 రౌండ్లు సగటున ఉగ్రవాదులు కేటాయిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. సీనియర్ ఉగ్రవాదులకు రైఫిల్స్ ఇస్తూ.. కొత్తగా ఉగ్రవాదంలోకి వచ్చిన వారికి మాత్రం పిస్తోళ్లు ఇస్తారని గతేడాది సీఆర్పీఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. భూమార్గంలో ఆయుధ రవాణాపై సైన్యం ఉక్కుపాదం మోపడంతో డ్రోన్ల సాయంతో పంజాబ్, జమ్ము, కశ్మీర్ ప్రాంతాల్లో ఆయుధాలను జారవిడుస్తున్నారు. వీటిల్లో రైఫిళ్ల సంఖ్యతో దాదాపు సమానంగా పిస్తోళ్లు, గ్రనేడ్లు వంటివి ఉంటున్నాయి.
ఉగ్రకార్యకలాపాలకు కొత్త విధానం ..: కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్
‘‘అమాయకులను పిస్తోళ్లతో హత్యలు చేయడం ఉగ్రవాదుల కొత్త ఎత్తుగడగా మారింది. ఈ ఏడాది హత్యకు గురైన పోలీసు అధికారులు మొత్తం నిరాయుధులే. వారి వద్ద దాడి సమయంలో ఎటువంటి ఆయుధాలు లేవు. వీరిలో అత్యధిక మందిని పిస్తోళ్లతోనే ఉగ్రవాదులు హత్య చేశారు. చిన్న ఆయుధాలతో దాడి సులభం కావడంతో పాకిస్థాన్ ఈ మార్గాన్ని ఎంచుకొంది’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ (Modi) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. వాటిపై అందిన ఫిర్యాదు ఈసీ పరిశీలనలో ఉందని సమాచారం. -
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. -
నూడుల్స్లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!
నూడుల్స్లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. -
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు. -
రాహుల్పై పరువు నష్టం కేసు.. విచారణ మే 2కు వాయిదా
కేంద్ర హోం మంత్రి అమిత్షాను ఉద్దేశించి ఆరేళ్ల క్రితం కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై విచారణను ఉత్తర్ప్రదేశ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మే 2కు వాయిదా వేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్