Union Cabinet: మోదీ జట్టులో నలుగురు వైద్యులే!
ప్రధాని నరేంద్ర మోదీ కొత్త కేబినెట్ బుధవారం కొలువుదీరింది. అయితే అందులో నలుగురు వైద్యులు కావడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కొత్త కేబినెట్ బుధవారం కొలువుదీరింది. అయితే, అందులో నలుగురు వైద్యులు కావడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దేశంలో కొవిడ్ విలయం కొనసాగుతున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్య రంగానికి ప్రాధాన్యం పెంచేందుకు తన కొత్త జట్టులోకి నలుగురు వైద్యులను మోదీ తీసుకున్నట్టు పలువురు భావిస్తున్నారు. కొత్తగా మోదీ జట్టులో స్థానం దక్కించుకున్న ఆ నలుగురి గురించి సంక్షిప్తంగా..!
డా.సుభాశ్ సర్కార్:
డా.సుభాశ్ సర్కార్ (68) పశ్చిమ బెంగాల్లోని బంకురా నుంచి భాజపా తరఫున 2019 ఎన్నికల్లో లోక్సభ ఎంపీగా గెలుపొందారు. ఆయన కలకత్తా విశ్వవిద్యాలయానికి చెందిన బీఎస్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. భాజపాలో పలు పదవులు నిర్వహిస్తూనే 28 ఏళ్ళుగా గైనకాలజిస్టుగానూ సేవలందిస్తున్నారు. శాస్త్ర, సామాజిక అంశాలకు సంబంధించిన పలు సెమినార్లకు అధ్యక్షత వహించారు.
డా.భారతి ప్రవీణ్ పవార్:
మహారాష్ట్రకు చెందిన డా.భారతి ప్రవీణ్ పవార్ నాసిక్లోని డిండోరి నియోజకవర్గం నుంచి భాజపా తరఫున ఎంపీగా గెలుపొందారు. ఆమె పుణె విశ్వవిద్యాలయానికి చెందిన ఎన్డీఎమ్వీపీ మెడికల్ కళాశాల నుంచి ఎంబీబీఎస్ డిగ్రీ పొందారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. నాసిక్ జిల్లా పరిధిలో పోషకాహార లోపం, తాగునీటి సమస్యలపై ఆమె విస్తృత పోరాటం చేశారు.
డా.భగవత్ కిషన్రావ్ కారాడ్:
మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు చెందిన డా.భాగవత్ కిషన్రావ్ కారాడ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన ఔరంగాబాద్ నగరానికి రెండు పర్యాయాలు మేయర్గానూ పనిచేశారు. చిన్నపిల్ల్లల వైద్య నిపుణుడిగా ఈయనకు మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఔరంగాబాద్లో కారాడ్ ఆసుపత్రిని ఆయన నిర్వహిస్తున్నారు.
డాక్టర్ ముంజపర మహేంద్రభాయ్:
డా. ముంజప మహేంద్ర భాయ్ (52) గుజరాత్లోని సురేంద్రనగర్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. విద్యార్థి దశలో వ్యవసాయ కూలీగా పని చేసిన ఆయన.. బంధువులు, స్నేహితుల సహకారంతో అహ్మదాబాద్లోని ఎన్హెచ్ఎల్ మెడికల్ కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. ఇప్పటికీ పేదల కోసం వైద్య శిబిరాలను నిర్వహిస్తుంటారు. ఆయన గతంలో రాష్ట్రస్థాయిలో స్విమ్మింగ్ ఛాంపియన్గానూ గుర్తింపు సాధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు