50%మంది మాస్క్ పెట్టుకోవట్లేదు: కేంద్రం
దేశంలో విజృంభిస్తున్న కరోనా కట్టడికి మాస్క్ ధరించడం తప్పనిసరంటూ వైద్యరంగ నిపుణులు, ప్రభుత్వాలు పదే పదే హెచ్చరిస్తున్నా దేశంలో సగం మంది (50శాతం) ఇంకా మాస్క్లు పెట్టుకోవడంలేదని.....
దిల్లీ: దేశంలో విలయ తాండవం చేస్తున్న కరోనా వైరస్ కట్టడికి మాస్క్ ధరించడం తప్పనిసరంటూ వైద్యరంగ నిపుణులు, ప్రభుత్వాలు పదే పదే హెచ్చరిస్తున్నా అనేకమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దేశంలో సగం (50శాతం)మంది ఇంకా మాస్క్లు పెట్టుకోవడంలేదని కేంద్రం వెల్లడించింది. మాస్క్లు ధరిస్తున్నవారిలో కూడా 64శాతం మంది ముక్కును కప్పి ఉంచేలా సరిగా పెట్టుకోవడంలేదని ఓ అధ్యయనంలో తెలిందని పేర్కొంది. 20 శాతం మంది గడ్డం దగ్గరకు మాస్క్ తీసుకొచ్చి ఉంచుతున్నారని, మరో 2శాతం మంది మెడ దగ్గర ఉంచుతున్నట్టు ఆందోళన వ్యక్తంచేసింది. కేవలం 14 శాతం మంది మాత్రమే మాస్క్లు సరిగా పెట్టుకుంటున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వారు మాత్రమే వైరస్ ప్రవేశించకుండా పకడ్బందీగా ముక్కు, నోరు, గడ్డాన్ని కప్పి ఉంచేలా మాస్క్లు పెట్టుకొంటున్నారని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడారు. దేశంలో లక్ష కన్నా ఎక్కువ యాక్టివ్ కేసులు ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్నాయన్నారు. 50వేల నుంచి లక్ష యాక్టివ్ కేసులు 9 రాష్ట్రాల్లో; 50వేలకు పైగా క్రియాశీల కేసులు 19 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నట్టు వివరించారు. కర్ణాటక, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో 25శాతం పాజిటివిటీ రేటు ఉండటంపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. కరోనా వ్యాప్తికి కళ్లెం వేయాలంటే భౌతికదూరం పాటించడంతో పాటు మాస్క్లు ధరించడం అవసరమని కేంద్రం విజ్ఞప్తి చేసింది.
జూన్ నెలాఖరుకు రోజుకు 45లక్షల టెస్ట్లు..
ఈ నెలాఖరుకు రోజుకు సగటున 25లక్షల పరీక్షలు నిర్వహించడమే లక్ష్యమని ఐసీఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ బలరాం భార్గవ వెల్లడించారు. జూన్ ఆఖరు నాటికి పరీక్షల సామర్థ్యాన్ని 45లక్షలకు పెంచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు చెప్పారు. ఫిబ్రవరి మధ్య కాలం నాటితో పోలిస్తే సగటున రోజువారీ పరీక్షలు గత 12 వారాల్లో 2.3 రెట్లు పెరిగాయన్నారు. గత రెండు వారాలుగా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు వివరించారు. భారీ సంఖ్యలో ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేయడం వల్ల త్వరగా ఫలితం రావడంతో పాటు రోగులను వీలైనంత తొందరగా ఐసోలేట్ చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇంటివద్దే కొవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ఇప్పటికే ఒక కంపెనీ దరఖాస్తు చేసుకొందని, మరో వారంలోగా మరో మూడు రాబోతున్నాయని వెల్లడించారు. మూడు, నాలుగు రోజుల్లోనే హోమ్ టెస్టింగ్ కిట్లు మార్కెట్లో అందుబాటులోకి వస్తాయన్నారు.
జిల్లాల్లో పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయ్..
దేశంలో 25శాతం కన్నా ఎక్కువగా పాజిటివిటీ రేటు ఏడు రాష్ట్రాల్లో ఉండగా.. 15శాతం కన్నా ఎక్కువ పాజిటివిటీ రేటు 22 రాష్ట్రాల్లో; 5శాతం నుంచి 15శాతం వరకు పాజిటివిటీ రేటు ఉన్న రాష్ట్రాలు 13; ఒకే ఒక్క రాష్ట్రంలో 5శాతం కన్నా తక్కువ పాజిటివిటీ రేటు ఉందని కేంద్రం వెల్లడించింది. అత్యధికంగా లక్షద్వీప్లో 52.6శాతం పాజిటివిటీ రేటు ఉండగా.. గోవాలో 37%, పుదుచ్చేరిలో 34.9%; బెంగాల్లో 30.8%, కర్ణాటక 29.9%, సిక్కిం 26.4%, కేరళ 26.1%, ఏపీ 24.9 %గా పాజిటివిటీ రేటు ఉందని వివరించింది. అలాగే, గత కొన్నివారాలుగా అనేక జిల్లాల్లో పాజిటివ్ కేసులు తగ్గుతున్నట్టు కేంద్రం వెల్లడించింది. జిల్లాల్లో వారం వారం టెస్టులు పెరగ్గా.. పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని లవ్ అగర్వాల్ వెల్లడించారు. పాజిటివ్ కేసులు తగ్గుతున్న జిల్లాల సంఖ్య 210 నుంచి 303కి పెరిగిందని చెప్పారు.
దేశంలో అత్యధిక కేసులు వస్తున్న రాష్ట్రాలివే..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది. -
నేపాల్ మేయర్ కుమార్తె ఆచూకీ లభ్యం
గోవాలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన నేపాల్లోని ధన్గఢీ నగర మేయర్ కుమార్తె ఆర్తీ హమాల్(36) ఆచూకీ బుధవారం లభ్యమైంది. -
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు తన వద్ద లేవని.. అందుకే పార్టీ ప్రతిపాదనను తిరస్కరించానని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్