బీర్ వైరస్.. అన్న నేతకే కరోనా
కొవిడ్ను బీర్ వైరస్ అంటూ తేలికగా తీసుకున్న ఓ అమెరికా నేతకే కొవిడ్-19 సోకింది.
ఇంటర్నెట్ డెస్క్: కరోనా వైరస్ తీవ్రతను తక్కువ అంచనా వేసి.. బీర్ వైరస్ అంటూ దాన్ని తేలిగ్గా తీసుకున్న ఓ అమెరికా నేతకే ఇప్పుడు అది సోకింది. అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన అలస్కా సీనియర్ కాంగ్రెస్ సభ్యుడు డాన్ యంగ్ ఈ సంగతిని స్వయంగా సామాజిక మాధ్యమాల్లో ప్రకటించటం గమనార్హం. ‘‘నాకు కొవిడ్-19 పాజిటివ్ అని నిర్ధారణ అయింది. నేను నిబంధనలను పాటిస్తూ.. అలస్కాలో ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నాను. ఈ సమయంలో ఒంటరిగా ఉండాలని భావిస్తున్నాను. నేను ఆరోగ్యంగానే ఉన్నాను’’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, అలస్కాలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉందని.. ఆరోగ్య, ప్రజా రక్షణ వ్యవస్థలు ప్రభావితమయ్యే అవకాశముందని హెచ్చరికలు జారీకావటం గమనార్హం.
87 ఏళ్ల యంగ్ ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించి 25వ సారి కాంగ్రెస్కు ఎన్నికయ్యారు. తద్వారా సుదీర్ఘకాలం శాసన సభ్యుడిగా ఉన్న నేతగా రికార్డు సృష్టించారు. కొవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అప్పుడే పడగ విప్పుతున్న సమయంలో.. ఈ వ్యాధి కేవలం ప్రజల భయం నుంచి పుట్టిందని, దానికి అంత ప్రాముఖ్యం ఇవ్వనవసరం లేదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ‘కరోనా బీర్’ పేరుతో ఒక బీరు కూడా ఉండటంతో.. దానిని ‘బీర్ వైరస్’ అని పిలుస్తానని అప్పట్లో ప్రకటించారు.
ఇదిలా ఉండగా, కరోనా గురించి ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా.. నిజం, నిజమేనని అలస్కా గవర్నర్ మైక్ డన్లీవీ పేర్కొన్నారు. కొవిడ్ బాధితులు, దాని బారిన పడుతున్న ఆరోగ్య సేవల సిబ్బంది సంఖ్య కూడా అంచనాలకు అందనంతగా పెరుగుతోందని.. ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలంటూ ఆయన హెచ్చరిక జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు