థ్రిల్లర్: ఇరాన్లో ‘మొస్సాద్’ వేట..!
శుక్రవారం మూడు బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఇరాన్లోని అబ్సార్డ్ పట్టణంలో వెళుతున్నాయి.. హఠాత్తుగా ఓ భారీ పేలుడు.. ఏం జరుగుతోందో తెలిసే సమయానికి మధ్యలోని కారు వద్దకు ఆగంతకులు చేరుకొని విచక్షణ రహితంగా తూటాల వర్షం కురిపించారు.
* అణు పితామహుడి హత్య..
* కుంటుపడ్డ ‘గ్రీన్సాల్ట్ ప్రాజెక్టు’
* మొన్న అల్ఖైదా నంబర్-2 అంతం
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
శుక్రవారం మూడు బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఇరాన్లోని అబ్సార్డ్ పట్టణంలో ప్రయాణిస్తుండగా.. హఠాత్తుగా ఓ భారీ పేలుడు.. ఏం జరుగుతోందో తెలిసేలోపే మధ్యలోని కారు వద్దకు ఆగంతకులు చేరుకొని విచక్షణా రహితంగా తూటాల వర్షం కురిపించారు. ఆ కారులోని వీవీఐపీ మరణించినట్లు ధ్రువీకరించుకొని వెళ్లిపోయారు. ఈ ఘటన ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమానికి భారీ ఎదురు దెబ్బ. ఆ చనిపోయిన వీవీఐపీ ఎవరో కాదు.. ఆ దేశ అణుకార్యక్రమ పితామహుడిగా భావించే మొసిన్ ఫక్రిజాద్..! ఈ విషయం తెలిసన వెంటనే ఇరాన్ అగ్గిమీద గుగ్గిలం అయింది. దీని వెనుక ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ హస్తం ఉందని.. దీనికి ప్రతీకారం తీర్చుకొంటామని ప్రకటించింది. దీనిపై ఇజ్రాయెల్ ఎప్పటిలానే ఏమీ స్పందించలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఫక్రిజాద్ హత్యపై ఇజ్రాయెల్ రిపోర్టర్ కథనాన్ని రీట్వీట్ చేసి ఊరుకొన్నారు.
గతంలో అమెరికా సీఐఏకు తమ దేశంలో ఏజెంట్లుగా పనిచేస్తున్న వారినే గుర్తించి.. వెతికి, వేటాడి చంపిన ఇరాన్లోనే.. ఇజ్రాయెల్ మొస్సాద్ ఏజెంట్లు స్వైర విహారం చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఇరాన్లో నక్కిన అల్ఖైదా నంబర్-2ను వేటాడి మట్టుబెట్టారు.
ఎవరీ ఫక్రిజాద్..?
మొసిన్ ఫక్రిజాద్ ఓ భౌతిక శాస్త్రవేత్త. ఆయన ఇమామ్ హుస్సేన్ విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్ర ఆచార్యుడిగా పనిచేస్తారని ఇరాన్ బాహ్య ప్రపంచానికి చెబుతుంది. కానీ, ఆ దేశ డీఫాక్టో పాలకులైన ఖోమైనీలకు మాత్రం జవాబుదారీగా ఉండే ‘ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్’కోర్లో ఆయనకు బ్రిగేడియర్ హోదా ఉంది. ‘ఆర్గనైజేషన్ ఆఫ్ డిఫెన్సీవ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చి’కి, ‘గ్రీన్ సాల్ట్ ప్రాజెక్ట్’కు నాయకత్వం వహిస్తున్నారు. 2018లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ ఇరాన్ అణుకార్యక్రమైన ఏఎంఏడీ ప్రాజెక్టుకు ఫక్రిజాద్ను కీలక వ్యక్తిగా పేర్కొన్నారు. ఫక్రిజాద్ భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉంటుంది. ఆయన దగ్గరకు కూడా ఎవరూ వెళ్లలేరు. ఆయన్ను ఇరాన్ రాబర్ట్ ఓప్పెన్ హైమర్ (అమెరికా అణుపితామహుడు)తో పోలుస్తూ గతంలో వాల్స్ట్రీట్ పత్రిక పేర్కొంది.
ఈ ‘గ్రీన్సాల్ట్ ప్రాజెక్టు’ ఏమిటీ..?
అణ్వాయుధ తయారీలో యురేనియం ఇంధనంగా ఉపయోగపడుతుంది. భూమి నుంచి వెలికితీసిన రూపంలో దీనిని వాడరు.. శుద్ధిచేయాల్సి ఉంటుంది. ఇలా శుద్ధి చేసి ఆయుధ గ్రేడు యూరేనియం తయారు చేసే కార్యక్రమానికి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ పెట్టిన పేరు ‘గ్రీన్సాల్ట్ ప్రాజెక్టు’. దీనినే ‘ప్రాజెక్టు1-11’ అని కూడా అంటారు. ఇక్కడే క్షిపణుల వార్హెడ్లను కూడా తయారు చేస్తారు. ఈ మొత్తం ప్రాజెక్టులో ఫక్రిజాద్ కీలకమైన వ్యక్తి.
కార్లలో మాటువేసి..!
కొన్నేళ్లుగా ఫక్రిజాద్ కోసం సీఐఏ, మొస్సాద్ ఏజెంట్లు కాచుకు కూర్చున్నారు. దీంతో ఆయనకు ఇరాన్ ప్రభుత్వం భారీ భద్రతను కల్పించింది. బుల్లెట్ ప్రూఫ్ కార్లతోపాటు గన్మెన్లు ఆయన వెన్నంటే ఉంటారు. దీంతో ఆయన హత్య కోసం దాదాపు 62 మంది ఓ బృందంగా పనిచేశారని ఇరాన్ జర్నలిస్టు మొహమ్మద్ ఆహ్వాజే తన కథనంలో పేర్కొన్నారు. వీరిలో అత్యంత సుశిక్షితులైన 12 మంది సాయుధులు కాగా.. మిగిలిన వారు ప్లాన్ అమలుకు సహకరించినట్లు పేర్కొన్నారు.
గత శుక్రవారం ఫక్రిజాద్ టెహ్రాన్కు 40కిమీ దూరంలోని అబ్సార్డ్ పట్టణంలోకి వస్తున్నట్లు ఆగంతకులు సమాచారం తెలుసుకొన్నారు. ఈ పట్టణం ఓ పర్వత ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ టెహ్రాన్లోని సంపన్నుల గెస్ట్హౌస్లు వంటివి ఎక్కువగా ఉంటాయి. పట్టణం మొదట్లో భారీ వృక్షాలు ఉంటాయి. దీంతో అక్కడే హత్య చేయాలని సాయుధులు ప్లాన్ వేశారు. ఒక కారు, నాలుగు మోటార్ సైకిళ్లపై వారు సిద్ధంగా ఉన్నారు. మరో ట్రక్కులో బాంబును అమర్చి ఉంచారు. ఫక్రిజాద్ వాహన శ్రేణిలోని మూడు బుల్లెట్ ప్రూఫ్ కార్లు అక్కడకు రాగానే కరెంటు పోయింది. ట్రక్కు బాంబును పేల్చారు. అనంతరం 12 మంది సాయుధులు నేరుగా ఫక్రిజాద్ కారు వద్దకు చేరుకొని కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించేటప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వాహనాలపై వచ్చి కాల్పులు జరిపి అదృశ్యం కావడం మొస్సాద్ స్టైల్.. అందుకే ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్ను నిందిస్తోంది. గతంలో కూడా అర్డెషిర్ హుస్సేన్ పౌర్, మసూద్ అలీ మహమ్మద్, మాజిద్ షహరియార్, ముస్తఫా అహ్మద్ రోషన్ల వంటి అణు శాస్త్రవేత్తలను కూడా ఇలానే అంతమొందించారు.
కొన్నాళ్ల క్రితమే అల్ఖైదా నంబర్-2 అంతం..!
ఆగస్టు 7వ తేదీన టెహ్రాన్లో తెల్లరంగు కారుపై బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపి క్షణాల్లో అదృశ్యమైపోయారు. ఆ కారులో ఉన్న ఓ వ్యక్తి.. అతని కుమార్తె ఈ ఘటనలో మరణించారు. ఆ మరణించిన వ్యక్తి పేరు హబీబ్ దావూద్ ఇబ్రహీం అని.. లెబనాన్ హిస్టరీ ప్రొఫెసర్ అని ఇరాన్ పేర్కొంది. హిజ్బోల్లాతో కలిసి పనిచేస్తారని వెల్లడించింది. కారులోని మహిళ అతని కుమార్తె మరియం అని చెప్పారు. కానీ, ఆ పేరుతో అసలు హిస్టరీ ప్రొఫెసర్ ఎవరూ లేరని తేలింది. హిజ్బోల్లా కూడా దీనిపై ఏమీ మాట్లాడలేదు. నవంబర్ 13న అసలు విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ బయటపెట్టింది. ఆగస్టు 7న మరణించిన వ్యక్తి ఈజిప్టు వాసి అబ్దుల్లా అహ్మద్ అబ్దుల్లా.. అలియాస్ అబు అల్ మస్రీ..! అల్ఖైదా నంబర్ 2..! 1998లో ఆఫ్రికాలో కెన్యా రాజధాని నైరూబీలో, టాంజానియాల్లోని అమెరికా దౌత్య కార్యాలయాలపై దాడికి సూత్రధారి. బిన్లాడెన్ వెంట వచ్చి అల్ఖైదా ఏర్పాటు చేసిన తొలి వందమందిలో ఏడో వ్యక్తి. అల్మస్రీతోపాటు మరణించిన మరియంను..ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జా భార్యగా గుర్తించారు. హమ్జాను 2019లో అమెరికా దళాలు మట్టుబెట్టాయి. అల్ఖైదాను ఇరాన్ వ్యతిరేకిస్తోంది. కానీ, దివంగత జనరల్ ఖాసీం సులేమానీ ఆశీస్సులతో వీరికి ఆశ్రయం దొరికింది.
అల్మస్రీని మట్టుబెట్టే పనిని అమెరికా నిఘా సంస్థ సీఐఏ ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్కు అప్పజెప్పింది. సీఐఏ మస్రీ అనుపానులు సేకరించి మొస్సాద్కు అందించింది. మొస్సాద్కు చెందిన అత్యంత శక్తిమంతమైన ‘కిదూన్’ యూనిట్ రంగంలోకి దిగింది. మొస్సాద్ మిగిలిన ఏజెంట్లకు కూడా ఈ కిదూన్ యూనిట్ వివరాలు తెలియవు. ఇజ్రాయెల్ హైప్రొఫైల్ వ్యతిరేకులను మట్టుబెట్టడం దీని విధి. లక్ష్యం ఛేదించాక ఆధారాలు లేకుండా అదృశ్యం కావడం దీని స్టైల్. కొన్నాళ్ల కిందట ఇరాన్ రక్షణ స్థావరాల్లో పేలుళ్లు కూడా ఇదే విభాగం చేపట్టినట్లు అనుమానాలు ఉన్నాయి. బైక్పై వచ్చి మట్టుబెట్టడం కిదూన్ మార్క్ స్టైల్. 1998 పేలుళ్లలో కెన్యాలో చనిపోయిన వారిలో ఇజ్రాయిలీలు కూడా ఉన్నారు. అందుకే కిదూన్ రంగంలోకి దిగి మస్రీపై ప్రతీకారం తీర్చుకొంది. 1998లో పేలుళ్లు జరిగింది ఆగస్టు 7వ తేదీనే.. మస్రీ అంతం కూడా సరిగ్గా 22 ఏళ్ల తర్వాత ఆగస్టు 7వ తేదీనే..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
ఎన్నికల వేళ.. రాజస్థాన్లోని బన్స్వారా నియోజకవర్గంలోని పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. తమ అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేపట్టింది. -
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
Nitin Gadkari: లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సభలో మాట్లాడుతూ స్పృహతప్పి పడిపోయారు. -
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా ద్వారా రూ.కోట్లు ఆర్జించిన గ్యాంగ్స్టర్ రవికానా, అతడి ప్రియురాలిని థాయ్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది.
తాజా వార్తలు (Latest News)
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!