సరిహద్దుల్లో పాక్‌ కుట్ర భగ్నం!

సరిహద్దుల్లో దాయాది దేశం పాకిస్థాన్‌ పన్నిన మరో కుట్రను సరిహద్దు దళం భగ్నం చేసింది. జమ్మూకశ్మీర్‌లో సరిహద్దు గుండా భారీ ఎత్తున మాదకద్రవ్యాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి సరఫరా చేయాలన్న దుండగుల కుట్రలను బలగాలు తిప్పికొట్టాయి..........

Published : 20 Sep 2020 11:51 IST

దిల్లీ: సరిహద్దుల్లో దాయాది దేశం పాకిస్థాన్‌ పన్నిన మరో కుట్రను సరిహద్దు దళం భగ్నం చేసింది. జమ్మూకశ్మీర్‌లో సరిహద్దు గుండా భారీ ఎత్తున మాదకద్రవ్యాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి సరఫరా చేయాలన్న దుండగుల కుట్రలను బలగాలు తిప్పికొట్టాయి. పాక్‌వైపు సరిహద్దుకు సమీపంలో కొంతమంది అనుమానిత వ్యక్తులు తిరుగుతుండటం గమనించిన సైనికులు హెచ్చరిక కాల్పులు జరిపారు. దీంతో ముష్కరులు అక్కడి నుంచి పాక్‌ వైపు పరుగులు తీశారు. ఈ క్రమంలో దుండగులు చక్కర్లు కొట్టిన ప్రాంతంలో తనిఖీ చేయగా.. భారీ ఎత్తున ఆయుధాలు, రెండు తుపాకులు, మాదకద్రవ్యాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. దుండగులకు భారత్‌వైపు కూడా సంబంధాలు ఉండే అవకాశం ఉందని సైనిక వర్గాలు అనుమానిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని