బైడెన్ మాట నిలబెట్టుకునేనా?
దాదాపు నాలుగు రోజుల ప్రపంచం ఉత్కంఠగా నిరీక్షించిన తర్వాత డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించబోతున్నట్లు తేలింది. మరోవైపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నాప్పటికీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 270 నిదాటేసిన బైడెన్.. 290 ఎలక్టోరల్ ఓట్లను తన ఖాతాలో వేసుకున్నారు. అమెరికా సంప్రదాయం ప్రకారం జనవరి 20న...
వాషింగ్టన్: దాదాపు నాలుగు రోజులపాటు ప్రపంచం ఉత్కంఠగా నిరీక్షించిన తర్వాత డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించబోతున్నట్లు తేలింది. మరోవైపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నాప్పటికీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 270ని దాటేసిన బైడెన్.. 290 ఎలక్టోరల్ ఓట్లను తన ఖాతాలో వేసుకున్నారు. అమెరికా సంప్రదాయం ప్రకారం జనవరి 20న ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో డెమొక్రాట్ల మేనిఫెస్టో (పాలసీ పేపర్)ని బట్టి భారత్- అమెరికా సంబంధాలు ఎలా ఉంటాయనేది ఒకసారి పరిశీలిస్తే!
ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు పుంజుకున్న మాట వాస్తవం. ఇటీవలే దేశ రక్షణకు సంబంధించిన ఒప్పందంపై ఇరు దేశాల నేతలు సంతకాలు చేశారు. మరోవైపు జో బైడెన్ విడుదల చేసిన పాలసీ పేపర్ ప్రకారం భారత్- అమెరికా సంబంధాలు మరింత బలోపేతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్లో భారత్ను శాశ్వత ప్రతినిధిగా చేర్చేందుకు అమెరికా మద్దతివ్వొచ్చు. అంతేకాకుండా ఉగ్రవాద నిర్మూలన, వాతావారణ మార్పులు, ఆరోగ్యం, వాణిజ్యం తదితర రంగాల్లో రెండు దేశాలూ కలిసి ముందుకు వెళ్లే అవకాశాలున్నాయి.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ 2006లో చెప్పిన తన మాటను నిలబెట్టుకునే సమయం వచ్చింది. ఎలా అంటే.. 2006లో బైడెన్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘2020 నాటికి ప్రపంచంలో అత్యంత సన్నిహిత దేశాలుగా భారత్, అమెరికా అవతరించాలి. అప్పుడే ప్రపంచం మొత్తం ప్రశాంతంగా ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు. దానికి కార్యరూపం దాల్చే సమయం వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఆయన చెప్పినట్లు 2020 చివరినాటికి కాకపోయినా.. కనీసం 2021 నాటికైనా అమెరికాతో భారత్ సంబంధాలు మరింత బలపడే అవకాశముంది. భారత్కు బైడెన్ కొత్తేమీ కాదు. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అంతర్జాతీయ వ్యవహరాల కమిటీ ఛైర్మన్గా, ఉపాధ్యక్షుడి హోదాలు చాలా సార్లు అధికారిక చర్చలు జరిపారు.
భారత్, అమెరికా భాగస్వాములనే తన చిరకాల నమ్మకాన్ని ఉటంకిస్తూ బైడెన్ కొద్ది రోజుల్లో ప్రకటన విడుదల చేసే అవకాశముంది. అంతేకాకుండా ఇండియాతో సంబంధాలను బలోపేతం చేయడానికి బైడెన్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని బైడెన్ ఇది వరకే ఎన్నికల ప్రచారంలో చాలా సార్లు చెప్పారు. ‘‘భారత్- అమెరికా కలిసి పని చేయకపోతే ప్రపంచ సవాళ్లను అధిగమించలేం. దీనికోసం భారత్ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం, ఉగ్రవాద చర్యల అణచివేత, ఆరోగ్య, వాణిజ్య తదితర రంగాల్లో అమెరికా మద్దతు కొనసాగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలున్న అమెరికా, భారత్.. ప్రజాస్వామ్య విలువలను పంచుకుంటాయి’’ అని డెమొక్రాటిక్ పార్టీ తన పాలసీ పేపర్లో తెలిపింది. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయనతోపాటు ఉపాధ్యక్ష స్థానంలో ఉన్న తాను కూడా భారత్తో సంబంధాల కోసం కృషి చేశానని ఆయన పలుమార్లు చెప్పారు. దీనిని బట్టి ఇప్పటితో పోల్చుకుంటే భారత్తో అమెరికా బంధం మరింత బలోపతం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.