కరోనా కాలమైనా.. ప్రపంచాన్ని చుట్టేశాడు
కరోనా.. లాక్డౌన్.. ఎవ్వరూ బయటకు రావొద్దు. సామాజిక దూరం పాటించండి. లేకపోతే మహమ్మారి సోకేస్తుంది. ఇదీ గత కొన్ని నెలలుగా చాలా మంది చెబుతున్న మాట. కానీ, కెనడాకు చెందిన బెర్ట్ టెర్హార్ట్స్కి మాత్రం అలాంటి భయమేమీ లేదు. కరోనా వస్తే నాకేంటి? పోతే నాకేంటి? అనే ధీమాతో ఉన్నారు. ఎందుకో తెలుసా? ఈ వైరస్ మన ప్రపంచంపై దాడి చేయక ముందే ఆయన అందరికీ దూరంగా ఉంటూ...
ఇంటర్నెట్డెస్క్: కరోనా.. లాక్డౌన్.. ఎవ్వరూ బయటకు రావొద్దు. సామాజిక దూరం పాటించండి. లేకపోతే మహమ్మారి సోకేస్తుంది. ఇదీ గత కొన్ని నెలలుగా చాలా మంది చెబుతున్న మాట. కానీ, కెనడాకు చెందిన బెర్ట్ టెర్హార్ట్స్కి మాత్రం అలాంటి భయమేమీ లేదు. కరోనా వస్తే నాకేంటి? పోతే నాకేంటి? అనే ధీమాతో ఉన్నారు. ఎందుకో తెలుసా? ఈ వైరస్ మన ప్రపంచంపై దాడి చేయక ముందే ఆయన అందరికీ దూరంగా ఉంటూ సామాజిక దూరం పాటిస్తున్నారు. ఒకరితో సంబంధం లేకుండా తానొక్కడే ప్రపంచాన్ని చుట్టేసే సాహస యాత్రలో ఉన్నారు. 62 ఏళ్ల వయసులో బెర్ట్ టెర్హార్ట్స్ ఈ సాహసానికి పూనుకోవడం ఆశ్చర్యం కలిగించేదే. అదేదో అత్యాధునిక టెక్నాలజీ వాడి ప్రపంచం చుట్టూ తిరగాడంటే అదీ పొరపాటే. పాత కాలం నాటి సెలెస్టికల్ నేవిగేషన్ సిస్టమ్, ఓ పెన్ను పేపర్ పట్టుకొని 13 అడుగుల బోటుపై తిరిగేశారు.
‘ట్రావెల్ లీజర్’ కథనం ప్రకారం ఇలాంటి నేవిగేషన్ సిస్టమ్ ఉపయోగించి ప్రపంచాన్ని చుట్టేసిన వ్యక్తుల్లో బెర్ట్ టెర్హార్ట్ ఎనిమిదో వ్యక్తి. ఉత్తర అమెరికా ఖండంలో మొదటి వ్యక్తి.
గత అక్టోబర్లో తన సాహస యాత్రను ప్రారంభించి ఈ ఏడాది జులైలో ముగించారట. అయితే ఆయన యాత్ర అంతసాఫీగా సాగలేదు. యాత్రకుమందు కూడా ఆయన ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. బెర్ట్ టెర్హార్ట్కు సెయిలింగ్పై మంచి పట్టుంది. యుక్తవయస్సులోనే సెయిలింగ్కు సంబంధించిన టిప్స్ అన్నీ నేర్చుకున్నారు. ఆయన తన డిగ్రీని కూడా ఓషియానోగ్రఫీలోనే పూర్తి చేశారంటే ఆయనకు సెయిలింగ్పై ఎంత మక్కువ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
‘‘చిన్నప్పటి నుంచి సముద్ర అన్వేషకులు అంటే చాలా ఆసక్తి ఉండేంది. ఎవరికీ సాధ్యం కాని అనుభూతిని వారు సొంతం చేసుకుంటారు. సముద్రంలో అలా వెళ్తూ ఉంటే ప్రతిదీ కొత్తగా అనిపిస్తుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం, అలలు, వాటి మధ్య తిరుగాడుతున్న తిమింగలాలు అన్నీ ఆశ్చర్యంగా అనిపిస్తాయి. తినే తిండి, కట్టుకునే బట్టలు ఇలా ప్రతీదీ ప్రత్యేకమే. సముద్రం మధ్యలో ఎక్కడున్నామో తెలుసుకోవడం కూడా కొత్త అనుభూతినిస్తుంది. మార్గమద్యంలో భూభాగమేమైనా ఉంటే చూడాలన్న ఉత్సుకత ఉంటుంది.’’అని మేగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బెర్ట్ టెర్హార్ట్స్ వెల్లడించారు.
బెర్ట్ టెర్హార్ట్స్ యాత్ర అంతసాఫీగా సాగలేదు. మధ్యలో ఎన్నెన్నో ఆటంకాలు.. కొన్ని సార్లు నేవిగేషన్ సరిగా పని చేసేది కాదు. వాతావరణం గురించి తెలిసేది కాదు. హరికేన్లు ఎదుర్కోవాల్సి వచ్చేదట. సముద్రంలో ఎక్కడున్నానన్నది తెలుసుకోవడం చాలా కష్టంగా అనిపించిందని బెర్ట్ చెబుతున్నారు. నేవిగేషన్ కచ్చితంగా తెలియాలంటే స్థిరంగా ఒక చోట ఉండాలి. కానీ, ఓ చిన్న బోటులో అలల మధ్య కదలాడుతూ ఉన్నప్పుడు కచ్చితత్వం లోపిస్తుంది. దీనివల్ల కొన్నిసార్లు వేరే మార్గంలోకి వెళ్లిపోయే అవకాశమూ ఉంది. ఇన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ ఆయన వెనకడుగు వేయలేదు. రోజుకు 4 గంటలు మాత్రమే పడుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగించానని బెర్ట్ చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే