బిన్ లాడెన్ను అలా మట్టుబెట్టాం: ఒబామా
అంతర్జాతీయ ఉగ్రవాది, అల్ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్పై అమెరికా జరిపిన దాడిలో పాకిస్థాన్ నుంచి ఎలాంటి సాయం తీసుకోలేదని అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు. పాక్ మిలిటరీలోని కొన్ని అంతర్గత శక్తులకు తాలిబన్,
2011 నాటి కమాండో ఆపరేషన్ను గుర్తుచేసుకున్న మాజీ అధ్యక్షుడు
వాషింగ్టన్: అంతర్జాతీయ ఉగ్రవాది, అల్ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్పై అమెరికా జరిపిన దాడిలో పాకిస్థాన్ నుంచి ఎలాంటి సాయం తీసుకోలేదని అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు. పాక్ మిలిటరీలోని కొన్ని అంతర్గత శక్తులకు తాలిబన్, అల్ఖైదాతో సంబంధాలున్నాయన్నది బహిరంగ రహస్యమే అని, అలాంటప్పుడు పాక్ నుంచి మద్దతు ఎలా ఆశిస్తామని ఒబామా అభిప్రాయపడ్డారు. ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’ పేరుతో ఒబామా పుస్తకం రాశారు. ఇందులో బిన్ లాడెన్ కోసం అమెరికా కమాండోలు చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్ గురించి సవివరంగా ప్రస్తావించారు. ఆ ఆపరేషన్ గురించి ఆయన మాటల్లోనే..
‘అబొట్టాబాద్లోని పాకిస్థానీ మిలిటరీ కంటోన్మెంట్ శివారులో గల ఓ సురక్షిత ప్రాంతంలో అల్ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ దాక్కున్నట్లు మాకు స్పష్టమైన సమాచారం వచ్చింది. లాడెన్పై దాడి చేయడానికి ఈ సమాచారం చాలనిపించి వెంటనే కార్యాచరణ మొదలుపెట్టాం. ఎలాంటి దాడి చేయగలమని నేను టామ్ డోనిలన్(అప్పటి జాతీయ భద్రతా సలహాదారు), జాన్ బ్రెన్నన్(అప్పటి సీఐఏ అధికారి)లను అడిగాను. అయితే లాడెన్పై మేం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని గోప్యంగా ఉంచడం మా ముందున్న సవాల్. ఎందుకంటే దీనిపై చిన్న సమాచారం లీకైనా గొప్ప అవకాశాన్ని కోల్పోతామని మాకు తెలుసు. అందుకే కేవలం ప్రభుత్వంలోని అత్యంత తక్కువ మందికి మాత్రమే ఈ రహస్య ఆపరేషన్ గురించి తెలిసేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం.’
‘ఇక మాకున్న మరో అడ్డంకి పాకిస్థాన్. ఉగ్రవాదంపై పోరులో ఆ దేశ ప్రభుత్వం మాకు సహకరిస్తున్నప్పటికీ.. పాక్ మిలిటరీలో కొన్ని అంతర్గత శక్తులకు ముఖ్యంగా ఇంటెలిజెన్స్ సర్వీసెస్కు తాలిబన్, అల్ఖైదా ఉగ్రముఠాలతో సంబంధాలున్నాయన్నది బహిరంగరహస్యమే. కొన్ని సార్లు ఈ ముఠాలను ఆ దేశం భారత్, అఫ్గానిస్థాన్పై వ్యూహాత్మకంగా ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ఇక మరో విషయమేంటంటే.. బిన్లాడెన్ దాక్కున్న కాంపౌండ్ పాక్ మిలిటరీ కంటోన్మెంట్కు కేవలం కొన్ని మైళ్ల దూరంలోనే ఉంది. ఈ ఆపరేషన్ గురించి పాకిస్థానీలకు ఏదైనా చెబితే లాడెన్కు సమాచారం అందే అవకాశం ఉంది. అందుకే పాకిస్థానీలను ఇందులో భాగస్వాములను చేయొద్దని గట్టిగా నిర్ణయించుకున్నాం.’
‘సమాచారమంతా సేకరించిన తర్వాత చివరగా మా ముందున్న రెండు అవకాశాల గురించి చర్చించుకున్నాం. మొదటిది.. లాడెన్ ఉన్న కాంపౌండ్ను వైమానిక దాడులతో పూర్తిగా ధ్వంసం చేయాలి. రెండవది.. ప్రత్యేక కమాండో ఆపరేషన్. ఇందులో కొంతమంది కమాండోలు హెలికాప్టర్ ద్వారా పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించి, దాడి చేసి, ఆ దేశ పోలీసులు, మిలిటరీ స్పందించకముందే అక్కడి నుంచి తిరిగి రావాలి. రిస్క్ ఉన్నప్పటికీ నేను, జాతీయ భద్రతా బృందం రెండో అవకాశాన్ని ఎంచుకున్నాం. అయితే ఈ ఆపరేషన్ను ఆమోదించడానికి ఒకరోజు ముందు మీటింగ్లో హిల్లరీ క్లింటన్(అప్పటి విదేశాంగ మంత్రి) మాట్లాడుతూ.. ఈ ఆప్షన్ 51-49 శాతం పనిచేస్తుందని అన్నారు. రక్షణ మంత్రి రాబర్ట్ గేట్స్ కమాండో ఆపరేషన్ను వ్యతిరేకించి వైమానిక దాడులను పరిశీలిద్దామని చెప్పారు. ఇక ఉపాధ్యక్షుడు జో బైడెన్ కూడా వ్యతిరేకించారు. ఆపరేషన్ విఫలమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. చివరకు నిఘా వర్గాల నుంచి అత్యంత స్పష్టమైన సమాచారం వచ్చిన తర్వాత అందరి అభిప్రాయాలు తీసుకుని ఆపరేషన్ చేపట్టాం.’
‘కమాండో ఆపరేషన్ విజయవంతమైన తర్వాత జాతీయ, అంతర్జాతీయ నేతల నుంచి అనేక ఫోన్ కాల్స్ వచ్చాయి. పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ నుంచి ఫోన్ వస్తే మాత్రం ఇబ్బంది తప్పదని భావించా. అనుకున్నట్లే ఆయన నుంచి కాల్ వచ్చింది. అయితే ఆపరేషన్పై ఆయన అభినందనలు తెలపడమేగాక, మద్దతు ప్రకటించడం సంతోషంగా అనిపించింది. లాడెన్ను మట్టుబెట్టడం మంచి విషయం అని జర్దారీ అన్నారు. తన భార్య బెనజీర్ భుట్టో ఉగ్రవాదుల చేతుల్లో హత్యకు గురవడాన్ని గుర్తుచేసుకుని ఉద్వేగానికి గురయ్యారు’ అంటూ ఒబామా ఆనాటి ఘటనలను పుస్తకంలో రాసుకొచ్చారు.
అమెరికా ట్విన్ టవర్స్ కూల్చి దాదాపు 3000 మందిని పొట్టనబెట్టుకున్న అల్ఖైదా అధినేత ఒసామా బిన్లాడెన్ను 2011 మే 2న అమెరికా దళాలు హతమార్చిన విషయం తెలిసిందే. అబొట్టాబాద్ కంపౌండ్లో నక్కిన లాడెన్ను యూఎస్ నేవీ సీల్ బృందం ప్రత్యేక కమాండో ఆపరేషన్ చేపట్టి మట్టుబెట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
Sunetra Pawar: బారామతి స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు రూ.25 వేల కోట్ల బ్యాంకు స్కామ్ కేసులో క్లీన్ చిట్ లభించింది. -
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
Viral video: ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
ఎన్నికల వేళ.. రాజస్థాన్లోని బన్స్వారా నియోజకవర్గంలోని పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. తమ అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేపట్టింది. -
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
Nitin Gadkari: లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సభలో మాట్లాడుతూ స్పృహతప్పి పడిపోయారు. -
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా ద్వారా రూ.కోట్లు ఆర్జించిన గ్యాంగ్స్టర్ రవికానా, అతడి ప్రియురాలిని థాయ్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం