చైనాకు మరోషాక్.. పబ్జీపై కేంద్రం నిషేధం
సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు భారత్ మరోసారి షాక్ ఇచ్చింది. డ్రాగన్ దేశానికి చెందిన మరో 118 మొబైల్ యాప్లపై .........
దిల్లీ: సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు భారత్ మరోసారి షాక్ ఇచ్చింది. డ్రాగన్ దేశానికి చెందిన మరో 118 మొబైల్ యాప్లపై నిషేధం విధించింది. వీటిలో పబ్జీ, క్యామ్ కార్డ్, బైడు, కట్ కట్ సహా మొత్తం 118 యాప్లపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వశాఖ వెల్లడించింది. గతంలో గల్వాన్ లోయ వద్ద చోటుచేసుకున్న ఘర్షణల సమయంలో టిక్టాక్ సహా 59 యాప్లపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సరిహద్దులో తాజాగా చోటుచేసున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు విఘాతం కలిగిస్తున్నాయనే కారణంతో మరికొన్ని చైనా యాప్లపైనా కేంద్రం వేటు వేసింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ప్లాట్ఫాంలపై లభ్యమయ్యే కొన్ని మొబైల్ యాప్లు తమ సమాచారాన్ని అనధికారికంగా సేకరించి దేశం వెలుపల ఉన్న సర్వర్లకు రహస్యంగా చేరవేస్తున్నట్టు అందిన ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐటీ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
పబ్జీకి ఎందుకంత క్రేజ్..
పోరాటాల ఆటలంటే ఇష్టపడేవారికి పబ్జీ ఓ విందు భోజనంలా ఉంటుంది. ఇందులో వంద మంది కలసి ఓ ప్రాంతంలో దిగి... తుపాకీలతో పోరాడి చివరికి నిలిచేవాడు విజేత అవుతాడు. బృందంతో ఆడితే బృందం విజేతగా నిలుస్తుంది. గెలిచినవారికి చికెన్ డిన్నర్ లభిస్తుంది. అంటే అదేదో గిఫ్ట్ అనుకోవడానికి వీల్లేదు.. ‘విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్’ అనే ఓ పోస్టర్ పడుతుంది. గన్లు, బాంబులు, కార్లు, బైక్లు, ఛేజింగ్లు, ఫైరింగ్ లాంటివి ఉండటంతో ఈ ఆట అంటే యువత తెగ ఇష్టపడుతుంది. దీనికోసమే స్మార్ట్ ఫోన్లు కొనుకున్న యువత కూడా ఉన్నారని ఇటీవల వార్తలు కూడా చదివాం. తొలుత ప్లే స్టేషన్ల, కంప్యూటర్లలో అందుబాటులో ఉన్న ఈ ఆట... ఫిబ్రవరి 9, 2018న మొబైల్ వెర్షన్లో మన దేశంలో లాంచ్ చేశారు. విడుదలైన తొలి ఏడాదే ప్లే స్టోర్లో ఉత్తమ యాప్గా నిలిచింది. ఆ తర్వాత లో ఎండ్ మొబైల్స్ కోసం 2019 ఆగస్టులో పబ్జీ లైట్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
పబ్జీకి ప్రపంచంలోనే కాదు భారత్లోనూ విశేష ఆదరణ ఉంది. ముఖ్యంగా యువత ఈ ఆటపట్ల ఎంతో ఆసక్తి కనబరిచారు. ఏమాత్రం ఖాళీ దొరికినా ఈ ఆటలోనే మునిగిపోతారు. ఒక్క భారత్లోనే 50మిలియన్లకు పైగా డౌన్లోడ్స్ ఉన్నాయంటే పబ్జీకి ఉన్న క్రేజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. నెలలపాటు ఈ ఆడటం కోసం నిద్రాహారాలు మాని అనేకమంది ప్రాణాలమీదకు తెచ్చుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. పబ్జీ గేమ్ కార్పొరేషన్ డైరెక్టర్లుగా బ్రెండన్ గ్రీన్, జాంగ్ టె-సియాక్ ఉన్నారు. 2000 సంవత్సరంలో జపనీస్ చిత్రం బ్యాటిల్ రాయల్ స్ఫూర్తితో దీన్ని రూపొందించారు.
కేంద్రం నిషేధించిన 118 మొబైల్ యాప్లు ఇవే..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
Sunetra Pawar: బారామతి స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు రూ.25 వేల కోట్ల బ్యాంకు స్కామ్ కేసులో క్లీన్ చిట్ లభించింది. -
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
Viral video: ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
ఎన్నికల వేళ.. రాజస్థాన్లోని బన్స్వారా నియోజకవర్గంలోని పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. తమ అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేపట్టింది. -
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
Nitin Gadkari: లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సభలో మాట్లాడుతూ స్పృహతప్పి పడిపోయారు. -
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా ద్వారా రూ.కోట్లు ఆర్జించిన గ్యాంగ్స్టర్ రవికానా, అతడి ప్రియురాలిని థాయ్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది.