వాతావరణ మార్పులపై పోరాడాలి: మోదీ

వాతావరణ మార్పులపై దేశాలు సమగ్రమైన రీతిలో పోరాడాల్సిన అవసరం ఉందని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ మేరకు జీ20 ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘సేఫ్‌గార్డింగ్‌ ప్లానెట్‌’ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు.

Published : 22 Nov 2020 22:29 IST

దిల్లీ: వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాలు సమగ్రమైన రీతిలో పోరాడాల్సిన అవసరం ఉందని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ మేరకు జీ20 ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘సేఫ్‌గార్డింగ్‌ ప్లానెట్‌’ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. ‘కొవిడ్‌-19 మహమ్మారి నుంచి పౌరుల్ని, ఆర్థికవ్యవస్థను కాపాడేందుకు భారత ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో.. వాతావరణ మార్పులపై పోరాటానికి సైతం అంతే ప్రాధాన్యం ఇస్తోంది. భూగ్రహాన్ని రక్షించుకోవడానికి వాతావరణ మార్పులపై నామమాత్రంగా కాకుండా సమగ్రమైన మార్గంలో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం భారత్‌ స్థితిస్థాపక అభివృద్ధి పద్ధతులు పాటిస్తోంది. కార్బన్‌ తక్కువ స్థాయిలో విడుదలయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటోంది.  భారత్‌ పారిస్‌ ఒప్పంద లక్ష్యాలను చేరుకోవడమే కాదు.. వాటిని మించిపోయింది. 2022 సంవత్సరానికల్లా 175గిగావాట్ల రెన్యూవబుల్‌ విద్యుత్‌ ఉత్పాదకతను లక్ష్యంగా పెట్టుకుంది.  అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాంకేతిక పరిజ్ఞానం సహాయంగా ఉంటే ప్రపంచం మొత్తం వేగంగా అభివృద్ధి చెందుతుంది’ అని మోదీ ప్రసంగంలో వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని