వాతావరణ మార్పులపై పోరాడాలి: మోదీ
వాతావరణ మార్పులపై దేశాలు సమగ్రమైన రీతిలో పోరాడాల్సిన అవసరం ఉందని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ మేరకు జీ20 ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘సేఫ్గార్డింగ్ ప్లానెట్’ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు.
దిల్లీ: వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాలు సమగ్రమైన రీతిలో పోరాడాల్సిన అవసరం ఉందని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ మేరకు జీ20 ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘సేఫ్గార్డింగ్ ప్లానెట్’ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. ‘కొవిడ్-19 మహమ్మారి నుంచి పౌరుల్ని, ఆర్థికవ్యవస్థను కాపాడేందుకు భారత ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో.. వాతావరణ మార్పులపై పోరాటానికి సైతం అంతే ప్రాధాన్యం ఇస్తోంది. భూగ్రహాన్ని రక్షించుకోవడానికి వాతావరణ మార్పులపై నామమాత్రంగా కాకుండా సమగ్రమైన మార్గంలో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం భారత్ స్థితిస్థాపక అభివృద్ధి పద్ధతులు పాటిస్తోంది. కార్బన్ తక్కువ స్థాయిలో విడుదలయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. భారత్ పారిస్ ఒప్పంద లక్ష్యాలను చేరుకోవడమే కాదు.. వాటిని మించిపోయింది. 2022 సంవత్సరానికల్లా 175గిగావాట్ల రెన్యూవబుల్ విద్యుత్ ఉత్పాదకతను లక్ష్యంగా పెట్టుకుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాంకేతిక పరిజ్ఞానం సహాయంగా ఉంటే ప్రపంచం మొత్తం వేగంగా అభివృద్ధి చెందుతుంది’ అని మోదీ ప్రసంగంలో వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.